కమల్ హాసన్ తనయురాలు శ్రుతి హాసన్ తండ్రి లాగే బహుముఖ ప్రజ్నాశాలి. ఆమె కథానాయికగా అవతారం ఎత్తడానికి ముందే సంగీత దర్శకురాలిగా పని చేసిన విషయం చాలామందికి తెలియదు. కమల్ కథానాయకుడిగా నటించిన ‘ఈనాడు’ చిత్రానికి ఆమే మ్యూజిక్ కంపోజర్.
సంగీతం విషయంలో చిన్నప్పట్నుంచి మంచి అభిరుచి ఉన్న శ్రుతి టీనేజీలో సొంతంగా కొన్ని ఆల్బమ్స్ చేసింది. కథానాయికగా బిజీ అయ్యాక కూడా కొన్ని సినిమాల్లో పాటలు పాడింది. ‘3’, ‘శ్రీమంతుడు’ లాంటి సినిమాల్లో తన గళాన్ని ఆమె వినిపించింది. ఐతే తర్వాత హీరోయిన్గా బాగా బిజీ అయిపోవడంతో తన సంగీతాభిరుచిని పక్కన పెట్టేసింది.
కొన్నేళ్ల కిందట సినిమాల నుంచి ఉన్నట్లుండి విరామం తీసుకున్న శ్రుతి.. లండన్ వెళ్లి కొన్ని బ్యాండ్లతో కలిసి పాటలు రూపొందించడం, సంగీత ప్రదర్శనలు ఇవ్వడం తెలిసిన సంగతే. ఇప్పుడు మరోసారి తనలోని గాయనిని బయటికి తీసుకొచ్చింది. ‘ఎడ్జ్’ పేరుతో ఆమె ఇంగ్లిష్ పాట పాడింది. దానికి సంగీతం కూడా తనే సమకూర్చుకుంది. ఈ పాటను తాజాగా సోషల్ మీడియాలో లాంచ్ చేసింది.
ఆ పాటను శ్రుతి ఆలపించిన వైనం చూస్తే ఇంటర్నేషనల్ రేంజ్ పాప్ సింగర్లు గుర్తుకొస్తున్నారు. వాయిస్లో మాడ్యులేషన్తో వావ్ అనిపించేలా ఈ పాటను ఆలపించింది శ్రుతి. నాగచైతన్య సహా చాలామంది సెలబ్రెటీలు ఈ పాటను ప్రమోట్ చేస్తూ శ్రుతిపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
This post was last modified on August 9, 2020 10:54 am
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…