కమల్ హాసన్ తనయురాలు శ్రుతి హాసన్ తండ్రి లాగే బహుముఖ ప్రజ్నాశాలి. ఆమె కథానాయికగా అవతారం ఎత్తడానికి ముందే సంగీత దర్శకురాలిగా పని చేసిన విషయం చాలామందికి తెలియదు. కమల్ కథానాయకుడిగా నటించిన ‘ఈనాడు’ చిత్రానికి ఆమే మ్యూజిక్ కంపోజర్.
సంగీతం విషయంలో చిన్నప్పట్నుంచి మంచి అభిరుచి ఉన్న శ్రుతి టీనేజీలో సొంతంగా కొన్ని ఆల్బమ్స్ చేసింది. కథానాయికగా బిజీ అయ్యాక కూడా కొన్ని సినిమాల్లో పాటలు పాడింది. ‘3’, ‘శ్రీమంతుడు’ లాంటి సినిమాల్లో తన గళాన్ని ఆమె వినిపించింది. ఐతే తర్వాత హీరోయిన్గా బాగా బిజీ అయిపోవడంతో తన సంగీతాభిరుచిని పక్కన పెట్టేసింది.
కొన్నేళ్ల కిందట సినిమాల నుంచి ఉన్నట్లుండి విరామం తీసుకున్న శ్రుతి.. లండన్ వెళ్లి కొన్ని బ్యాండ్లతో కలిసి పాటలు రూపొందించడం, సంగీత ప్రదర్శనలు ఇవ్వడం తెలిసిన సంగతే. ఇప్పుడు మరోసారి తనలోని గాయనిని బయటికి తీసుకొచ్చింది. ‘ఎడ్జ్’ పేరుతో ఆమె ఇంగ్లిష్ పాట పాడింది. దానికి సంగీతం కూడా తనే సమకూర్చుకుంది. ఈ పాటను తాజాగా సోషల్ మీడియాలో లాంచ్ చేసింది.
ఆ పాటను శ్రుతి ఆలపించిన వైనం చూస్తే ఇంటర్నేషనల్ రేంజ్ పాప్ సింగర్లు గుర్తుకొస్తున్నారు. వాయిస్లో మాడ్యులేషన్తో వావ్ అనిపించేలా ఈ పాటను ఆలపించింది శ్రుతి. నాగచైతన్య సహా చాలామంది సెలబ్రెటీలు ఈ పాటను ప్రమోట్ చేస్తూ శ్రుతిపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
This post was last modified on August 9, 2020 10:54 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…