రేపు బాక్సాఫీస్ వద్ద చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలు సందడి చేయబోతున్నాయి. దేనికీ భారీ ఓపెనింగ్స్ వస్తాయన్న గ్యారెంటీ లేకపోయినా అన్నీ ప్యూర్ కంటెంట్ ని నమ్ముకుని దిగుతున్నాయి. బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందిన నేను స్టూడెంట్ సర్ మీద కామన్ ఆడియన్స్ లో బజ్ లేకపోయినా పబ్లిక్ టాక్ ఖచ్చితంగా పాజిటివ్ గా ఉంటుందన్న నమ్మకం హీరోతో పాటు టీమ్ మొత్తంలో కనిపిస్తోంది. అయితే మొదటి రోజే థియేటర్ కు రప్పించే హుక్ పాయింట్ ప్రస్తుతానికి ఇందులో కనిపించడం లేదు. కాన్సెప్ట్ వెరైటీగా అనిపిస్తున్నా స్క్రీన్ మీద ఏదో మేజిక్ జరగాల్సిందే.
దగ్గబాటి వారసుడు అభిరాం అహింస రేపే రానుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ డ్రామలో ఏదో కొత్త విషయం, అదిరిపోయే స్క్రీన్ ప్లే ఉంటే తప్ప జనాన్ని రప్పించడం కష్టం. ఆర్పి పట్నాయక్ సంగీతం ఆశించిన స్థాయిలో ఛార్ట్ బస్టర్ అవ్వలేదు. మాసూద ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన పరేషాన్ మీద యూత్ లో ఓ మోస్తరు అంచనాలున్నాయి. అనూహ్యంగా దీనికి సమర్పకుడు రానా కావడం విశేషం. తమ్ముడి లాంచ్ అదే రోజు ఉందని తెలిసినా కూడా ఒక వారం ఆలస్యంగానో ముందుగానో రాకుండా క్లాష్ కి సిద్ధపడటం విచిత్రమే
చక్రవ్యూహం, ఐక్యూ, అభిలాష, బంగారు తెలంగాణ అనే మరో నాలుగు చిన్న సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఒక రోజు ముందే స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ రావడం మల్టీప్లెక్స్ కలెక్షన్లను ఆల్రెడీ లాగేస్తోంది. హిందీ నుంచి విక్కీ కౌశల్ జర హట్కె జర్ బచ్కె ఒకటే కాస్త నోటెడ్ రిలీజ్. స్టార్ అట్రాక్షన్ లేకుండా ఇంత టాలీవుడ్ క్లాష్ జరగడం కొత్తేమి కాకపోయినా కనీసం సగం హాళ్లు నిండేంత కూడా జనం రాకపోతే ఎన్ని విడుదలైనా తమకు ఆనందమేమి ఉందని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. మరి వీటిలో ఏవి మెప్పించబోతున్నాయో ఇంకో ఇరవై నాలుగు గంటల్లో తేలిపోతుంది
This post was last modified on June 1, 2023 11:24 am
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…