పుట్టి పెరిగింది చెన్నైలో, సినిమాల్లో అరంగేట్రం చేసింది కోలీవుడ్లో అయినా.. తర్వాత టాలీవుడ్లోకి అడుగు పెట్టి ఇక్కడ పెద్ద హీరోయిన్ అయిపోయింది సమంత. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించిన ఆమె సిటాడెల్ సిరీస్తో మరింత పాపులారిటీ తెచ్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. అది వచ్చే లోపే ఆమె హాలీవుడ్లోకి కూడా అరంగేట్రం చేయబోతుండటం విశేషం.
సామ్ తొలి హాలీవుడ్ సినిమా ఖరారైనట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి ‘చెన్నై స్టోరీ’ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందట. విల్ మచిన్ నిర్మాత. ఈ సినిమా కథకు సంబంధించిన విశేషాలు కూడా బయటికి వచ్చేశాయి.
లండన్లో స్థిరపడ్డ భారతీయ మూలాలున్న ఒక ఇంగ్లీష్ యువకుడు తన తండ్రిని వెతుక్కుంటూ చెన్నై వస్తాడు. అక్కడ తనకి ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. నిఖిల్ తండ్రిని వెతకడానికి సాయం చేయడానికి ఆమె ఒప్పుకుంటుంది. తర్వాత వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది అన్న ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కే ఈ చిత్రంలో సమంతకి జోడీగా వివేక్ కల్రా నటించనున్నాడట.
ఈ సినిమా షూటింగ్ చెన్నై, బ్రిటన్లో ఉంటుందట. సమంత నటిస్తున్న తొలి ఇంగ్లిష్ చిత్రమిది. ముందు అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి.. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ తదితర ప్రాంతీయ భాషల్లో విడుదల చేయడానికి చూస్తున్నారట. ప్రస్తుతం సమంత తెలుగులో ‘ఖుషి’ చిత్రం చేస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం సమంత, విజయ్ దేవరకొండ టర్కీకి వెళ్లారు.
This post was last modified on June 1, 2023 12:28 am
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…