యువ కథానాయకుడు నిఖిల్ ఇప్పుడు మామూలు ఊపులో లేడు. గత ఏడాది కార్తికేయ-2 పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయి అతడి మార్కెట్ను ఊహించని స్థాయిలో విస్తరించడంతో దర్శక నిర్మాతలు తనతో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. 18 పేజెస్ లాంటి ప్రేమకథా చిత్రం కూడా ఉన్నంతలో మంచి ఫలితాన్నే అందుకుంది.
త్వరలో విడుదల కానున్న స్పై మూవీ.. టీజర్తో బాగానే అంచనాలు పెంచింది. ఇటీవలే ది ఇండియా హౌస్ అనే మరో భారీ పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశారు నిఖిల్ హీరోగా. ఇంతలోనే నిఖిల్ హీరోగా తెరకెక్కనున్న ఇంకో పెద్ద సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇంతకుముందు నిఖిల్తో అర్జున్ సురవరం చిత్రాన్ని నిర్మించిన ఠాగూర్ మధు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
భరత్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. అతను తమిళంలో కొన్ని సినిమాలకు రచయితగా పని చేశాడు. నిఖిల్ హీరోగా ఒక చారిత్రక నేపథ్యమున్న సినిమాను అతను తెరకెక్కించనున్నాడు. ఒక ఖడ్గం తరహాలో ఉన్న ఆయుధంతో ఈ సినిమా ప్రి లుక్ను ఆసక్తికరంగా డిజైన్ చేశారు. గురువారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారు.
స్పై, ది ఇండియా హౌస్ సినిమాల్లాగే ఇది కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కనుంది. మనోజ్ పరమహంస, రవి బస్రూర్ (కేజీఎఫ్ ఫేమ్) లాంటి టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేయనున్నారు. బింబిసార రచయిత వాసుదేవ్ మునెప్పగారి ఈ చిత్రానికి మాటలు రాస్తున్నాడు. చూస్తుంటే ఇప్పుడు చేస్తున్న, చేయబోయే సినిమాలతో నిఖిల్ రేంజే మారిపోయేలా ఉంది.
This post was last modified on June 1, 2023 12:25 am
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…