యువ కథానాయకుడు నిఖిల్ ఇప్పుడు మామూలు ఊపులో లేడు. గత ఏడాది కార్తికేయ-2 పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయి అతడి మార్కెట్ను ఊహించని స్థాయిలో విస్తరించడంతో దర్శక నిర్మాతలు తనతో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. 18 పేజెస్ లాంటి ప్రేమకథా చిత్రం కూడా ఉన్నంతలో మంచి ఫలితాన్నే అందుకుంది.
త్వరలో విడుదల కానున్న స్పై మూవీ.. టీజర్తో బాగానే అంచనాలు పెంచింది. ఇటీవలే ది ఇండియా హౌస్ అనే మరో భారీ పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశారు నిఖిల్ హీరోగా. ఇంతలోనే నిఖిల్ హీరోగా తెరకెక్కనున్న ఇంకో పెద్ద సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇంతకుముందు నిఖిల్తో అర్జున్ సురవరం చిత్రాన్ని నిర్మించిన ఠాగూర్ మధు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
భరత్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. అతను తమిళంలో కొన్ని సినిమాలకు రచయితగా పని చేశాడు. నిఖిల్ హీరోగా ఒక చారిత్రక నేపథ్యమున్న సినిమాను అతను తెరకెక్కించనున్నాడు. ఒక ఖడ్గం తరహాలో ఉన్న ఆయుధంతో ఈ సినిమా ప్రి లుక్ను ఆసక్తికరంగా డిజైన్ చేశారు. గురువారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారు.
స్పై, ది ఇండియా హౌస్ సినిమాల్లాగే ఇది కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కనుంది. మనోజ్ పరమహంస, రవి బస్రూర్ (కేజీఎఫ్ ఫేమ్) లాంటి టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేయనున్నారు. బింబిసార రచయిత వాసుదేవ్ మునెప్పగారి ఈ చిత్రానికి మాటలు రాస్తున్నాడు. చూస్తుంటే ఇప్పుడు చేస్తున్న, చేయబోయే సినిమాలతో నిఖిల్ రేంజే మారిపోయేలా ఉంది.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…