కొన్ని ముచ్చట్లు చిన్నవిగా అనిపించినా అభిమానులకు మాత్రం భలే కిక్ ఇస్తాయి. ఎల్లుండి విడుదల కాబోతున్న నేను స్టూడెంట్ సర్ ప్రమోషన్ సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో బెల్లంకొండ గణేష్ ఓ ఆసక్తికరమైన ముచ్చట చెప్పాడు. అదేంటంటే ఇతను బాలకృష్ణ అబ్బాయి మోక్షజ్ఞ ఇద్దరూ మంచి స్నేహితులు. రచ్చ రిలీజైనప్పుడు కలిసి థియేటర్ కు వెళ్లారు. ప్రేక్షకుల గుంపులో ఎవరో గుర్తుపట్టేశారు. అరే రామ్ చరణ్ సినిమాకు బాలయ్య వారసుడు వచ్చాడని వెనుక నుంచి ఎవరో అరిచారట. దీంతో కాసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొందని చెప్పుకొచ్చాడు.
ఫాన్స్ మధ్య ఏమో కానీ నిజానికి హీరోలు వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి ఈగో పట్టింపులు ఉండవు. చరణ్ మూవీ అయినా భవిష్యత్తులో ఎలాగూ తాను పోటీ పడాల్సి ఉంటుంది కాబట్టి ఓసారి చూడమని మోక్షజ్ఞ వెళ్లి ఉండొచ్చు. లేదా నిజంగా అతనంటే ఇష్టం అయ్యుండొచ్చు. కారణం ఏదైనా మెగా పవర్ స్టార్ అభిమానులు మాత్రం చరణ్ మావాడే అంటూ ట్విట్టర్ లో ఆ వీడియోతో హంగామా చేస్తున్నారు. బెల్లంకొండ సురేష్ బాలయ్యల మధ్య అప్పట్లో మంచి స్నేహం ఉండేది. అదే ఫ్రెండ్ షిప్ గణేష్ మోక్షజ్ఞల మధ్య కూడా ఉండేదన్న క్లారిటీ వచ్చింది.
నేను స్టూడెంట్ సర్ మీద అంచనాలు పెద్దగా లేకపోయినా గణేష్ మాత్రం కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. మొదటి మూవీ స్వాతిముత్యం హిట్ కాలేదంటే ఒప్పుకోవడం లేదు. ఎక్కడికెళ్లినా తనతో సెల్ఫీలు దిగుతున్నారని దీనికన్నా సక్సెస్ ఏం కావాలని చెప్పాడు. లాజిక్ కొంచెం అమాయకంగా ఉన్నా కంటెంట్ పరంగా డెబ్యూ మీద ఎలాంటి కంప్లయింట్ రాలేదు. నేను స్టూడెంట్ సర్ లో మంచి ట్విస్టులు ఉంటాయని క్లైమాక్స్ మైండ్ బ్లాంక్ చేస్తుందని నిర్మాత చాలా ధీమాగా చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే డీసెంట్ టాక్ వస్తే చాలు హిట్ పడటం ఖాయంగా ఉంది
This post was last modified on May 31, 2023 9:31 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…