ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా హర్ట్ చేసిన వెబ్ సిరీస్ అంటే.. రానా నాయుడు అనే చెప్పాలి. ఫ్యామిలీ హీరోగా పేరుపడ్డ విక్టరీ వెంకటేష్, ఆయన అన్న కొడుకు రానా దగ్గుబాటి ఇందులో ప్రధాన పాత్రలు పోషించగా.. వారి కోసం సిరీస్ చూసిన వాళ్లకు దిమ్మదిరిగింది. వెబ్ సిరీస్లు అంటే కొంచెం బోల్డ్గా ఉండటం మామూలే కానీ.. ఇందులో బోల్డ్నెస్ శ్రుతి మించి వల్గర్గా తయారవడంతో మన వాళ్లు తట్టుకోలేకపోయారు.
ముఖ్యంగా వెంకీతో మాట్లాడించిన బూతులు.. ఇందులో కొన్ని సీన్లు చూసి ఆయన ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోయారు. ఓవరాల్గా ఈ సిరీస్ కూడా అనుకున్నంత ఆసక్తికరంగా లేకపోవడంంతో బాగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. వెంకీ ఎలా ఈ సిరీస్ చేశాడనే ప్రశ్నలు తలెత్తాయి అభిమానుల నుంచి. ఈ ఫీడ్ బ్యాక్ అంతా వెంకీకి చేరినట్లే కనిపిస్తోంది.
రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న అహింస సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్లో పాల్గొన్న వెంకీకి రానా నాయుడు ఫీడ్ బ్యాక్ గురించి ప్రశ్న ఎదురైంది. ఆ ఫీడ్ బ్యాక్ నేపథ్యంలో రెండో సీజన్ ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. తొలి సీజన్ చూసిన ప్రేక్షకుల స్పందనను తాను తెలుసుకున్నట్లు వెంకీ తెలిపాడు.
దాన్ని అనుసరించి వాళ్లకు నచ్చేలా, ఎక్కువమందికి రీచ్ అయ్యేలా రెండో సీజన్ తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు వెంకీ చెప్పాడు. ఐతే అన్నీ అందరికీ నచ్చాలని లేదని.. అందరినీ మెప్పించలేమని వెంకీ అన్నాడు. రానా నాయుడు ఒక హాలీవుడ్ సిరీస్ ఆధారంగా రూపొందిన విషయాన్ని గుర్తు చేస్తూ ఒరిజినల్ కంటెంట్ను మన వాళ్లకు నచ్చేలా రెండో సీజన్ను తీర్చిదిద్దుతున్నట్లు వెంకీ సంకేతాలు ఇచ్చాడు. ఆయన మాటల్ని బట్టి చూస్తే రెండో సీజన్లో వల్గారిటీ తగ్గొచ్చు.. అదే సమయంలో ఇది కూడా కొంచెం బోల్డ్గానే ఉంటుందని అర్థమవుతోంది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…