ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా హర్ట్ చేసిన వెబ్ సిరీస్ అంటే.. రానా నాయుడు అనే చెప్పాలి. ఫ్యామిలీ హీరోగా పేరుపడ్డ విక్టరీ వెంకటేష్, ఆయన అన్న కొడుకు రానా దగ్గుబాటి ఇందులో ప్రధాన పాత్రలు పోషించగా.. వారి కోసం సిరీస్ చూసిన వాళ్లకు దిమ్మదిరిగింది. వెబ్ సిరీస్లు అంటే కొంచెం బోల్డ్గా ఉండటం మామూలే కానీ.. ఇందులో బోల్డ్నెస్ శ్రుతి మించి వల్గర్గా తయారవడంతో మన వాళ్లు తట్టుకోలేకపోయారు.
ముఖ్యంగా వెంకీతో మాట్లాడించిన బూతులు.. ఇందులో కొన్ని సీన్లు చూసి ఆయన ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోయారు. ఓవరాల్గా ఈ సిరీస్ కూడా అనుకున్నంత ఆసక్తికరంగా లేకపోవడంంతో బాగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. వెంకీ ఎలా ఈ సిరీస్ చేశాడనే ప్రశ్నలు తలెత్తాయి అభిమానుల నుంచి. ఈ ఫీడ్ బ్యాక్ అంతా వెంకీకి చేరినట్లే కనిపిస్తోంది.
రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న అహింస సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్లో పాల్గొన్న వెంకీకి రానా నాయుడు ఫీడ్ బ్యాక్ గురించి ప్రశ్న ఎదురైంది. ఆ ఫీడ్ బ్యాక్ నేపథ్యంలో రెండో సీజన్ ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. తొలి సీజన్ చూసిన ప్రేక్షకుల స్పందనను తాను తెలుసుకున్నట్లు వెంకీ తెలిపాడు.
దాన్ని అనుసరించి వాళ్లకు నచ్చేలా, ఎక్కువమందికి రీచ్ అయ్యేలా రెండో సీజన్ తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు వెంకీ చెప్పాడు. ఐతే అన్నీ అందరికీ నచ్చాలని లేదని.. అందరినీ మెప్పించలేమని వెంకీ అన్నాడు. రానా నాయుడు ఒక హాలీవుడ్ సిరీస్ ఆధారంగా రూపొందిన విషయాన్ని గుర్తు చేస్తూ ఒరిజినల్ కంటెంట్ను మన వాళ్లకు నచ్చేలా రెండో సీజన్ను తీర్చిదిద్దుతున్నట్లు వెంకీ సంకేతాలు ఇచ్చాడు. ఆయన మాటల్ని బట్టి చూస్తే రెండో సీజన్లో వల్గారిటీ తగ్గొచ్చు.. అదే సమయంలో ఇది కూడా కొంచెం బోల్డ్గానే ఉంటుందని అర్థమవుతోంది.
This post was last modified on May 31, 2023 1:14 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…