నిర్మాత కొడుకులే కాదు , లక్షణాలుంటే ఆ కుటుంబంలో ఎవరైనా హీరో అవ్వొచ్చని తాజాగా దిల్ రాజు కుటుంబం నుండి హీరోగా వచ్చిన ఆశిష్ నిరూపించాడు. ఇప్పుడు మరో నిర్మాత కుటుంబం నుండి కొత్త హీరో రాబోతున్నాడు. ‘అఖండ’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కుటుంబం నుండి ఆయన బావ మరిది సాయి హీరోగా పరిచయం అవుతున్నాడు.
రెండేళ్ళుగా సాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తున్న మిరియాల రవీందర్ రెడ్డి ఫైనల్ గా ఆ బాధ్యతను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకి అప్పగించాడు. కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల సాయిను హీరోగా పరిచయం చేస్తూ ఓ న్యూ ఏజ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన అడ్డాల నటుడు , నిర్మాత నాగబాబు కొడుకు వరుణ్ తేజను ‘ముకుందా’ తో హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత మహేష్ , వెంకటేశ వంటి స్టార్స్ ను డైరెక్ట్ చేశాడు. ‘నారప్ప’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు ఈ యూత్ సినిమాతో రాబోతున్నాడు. మరి మిర్యాల రవీందర్ రెడ్డి పెట్టిన బాధ్యత ను శ్రీకాంత్ అడ్డాల ఎలా నిర్వర్తిస్తాడో ? డెబ్యూ హీరో సాయికి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి. ఇప్పటికే సినిమా షూటింగ్ సగం పైనే పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ జూన్ 2 న రిలీజ్ చేయనున్నారు.
This post was last modified on May 30, 2023 7:40 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…