లాక్ డౌన్ కారణంగా సినిమాల విడుదల ఆగిపోయింది. షూటింగులూ ఆగిపోయాయి. ముందు సినీ జనాలంతా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుందాంలే అనుకున్నారు. కానీ ఇప్పుడిప్పుడే మామూలు పరిస్థితులు నెలకొనే అవకాశం లేకపోవడంతో ఖాళీ సమయాన్ని ఎలా ఉపయోగించుకుందామా అని చూస్తున్నారు.
రచయితలు, దర్శకులు కథల మీద కూర్చుంటే.. హీరోలు కథలు వినే, స్క్రిప్టులు చదివే పనిలో పడ్డారు. నిర్మాతలు ప్రొడక్షన్ పనులు పకడ్బందీగా చేసుకుంటున్నారు. దీని వల్ల పోస్ట్ కరోనా రోజుల్లో ఒక పర్ఫెక్షన్ వస్తుందని.. సినిమాల నాణ్యత కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
మామూలుగా అయితే సినీ రంగంలో పనులన్నీ చాలా హడావుడిగా నడుస్తుంటాయి. రచయితలు, దర్శకులు సినిమాలకు, సినిమాలకు మధ్య పెద్దగా విరామం తీసుకోరు. నిర్మాతలు కూడా అంతా. స్క్రిప్టు, ప్లానింగ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ముందుకెళ్లిపోతుంటారు. ఈ హడావుడిలో కూడా ఔట్ పుట్ దెబ్బ తినేస్తుంటుంది. కానీ ఇప్పుడు సినీ జనాలకు ఎన్నడూ లేనంత ఖాళీ దొరికింది. ఈ సమయంలో పర్ఫెక్షన్ కోసం అందరూ ప్రయత్నం చేస్తారనడంలో సందేహం లేదు.
కొత్త కథలు రెడీ చేస్తున్నవాళ్లు డెడ్ లైన్ గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పని చేస్తారు. ఆల్రెడీ సిద్ధం చేసిన కథల్ని మరింత పక్కాగా తీర్చిదిద్దుకుంటారు. ఈ ప్రశాంత, ఆహ్లాద వాతావరణంలో ఆలోచనలు కూడా కచ్చితంగా మెరుగవుతాయి. కొత్త ఆలోచనలు పుడతాయి. ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం మంచి కథలు రెడీ అవుతాయి. అలాగే మేకింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాల విషయానికి వస్తే.. రషెస్ చూసుకుని లోపాలు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మిగతా షూటింగ్ విషయంలో ప్రణాళిక పక్కాగా ఉంటుంది. స్క్రిప్టులో మరిన్ని మంచి మార్పులు జరగొచ్చు.
హీరోలు కూడా ఇంతకుముందులా హడావుడి పడకుండా బోలెడన్ని కథలు విని.. వాటిలో అత్యుత్తమమైన వాటిని ఎంచుకునే అవకాశముంది. ఇంతకుముందు అవకాశం రాని వాళ్లు కథలు వినిపిస్తుండొచ్చు. పక్కన పడేసిన మంచి స్క్రిప్టుల్ని బయటికి తీసి చదవొచ్చు. ఇలా లాక్ డౌన్ తర్వాత సినిమాలు మెరుగ్గా తయారవడానికి మంచి అవకాశాలే ఉంటాయని.. వచ్చే ఏడాది సినిమాల క్వాలిటీ పెరిగి సక్సెస్ రేట్ కూడా పెరగొచ్చని ఆశించవచ్చు.
This post was last modified on April 24, 2020 4:28 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…