లాక్ డౌన్ కారణంగా సినిమాల విడుదల ఆగిపోయింది. షూటింగులూ ఆగిపోయాయి. ముందు సినీ జనాలంతా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుందాంలే అనుకున్నారు. కానీ ఇప్పుడిప్పుడే మామూలు పరిస్థితులు నెలకొనే అవకాశం లేకపోవడంతో ఖాళీ సమయాన్ని ఎలా ఉపయోగించుకుందామా అని చూస్తున్నారు.
రచయితలు, దర్శకులు కథల మీద కూర్చుంటే.. హీరోలు కథలు వినే, స్క్రిప్టులు చదివే పనిలో పడ్డారు. నిర్మాతలు ప్రొడక్షన్ పనులు పకడ్బందీగా చేసుకుంటున్నారు. దీని వల్ల పోస్ట్ కరోనా రోజుల్లో ఒక పర్ఫెక్షన్ వస్తుందని.. సినిమాల నాణ్యత కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
మామూలుగా అయితే సినీ రంగంలో పనులన్నీ చాలా హడావుడిగా నడుస్తుంటాయి. రచయితలు, దర్శకులు సినిమాలకు, సినిమాలకు మధ్య పెద్దగా విరామం తీసుకోరు. నిర్మాతలు కూడా అంతా. స్క్రిప్టు, ప్లానింగ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ముందుకెళ్లిపోతుంటారు. ఈ హడావుడిలో కూడా ఔట్ పుట్ దెబ్బ తినేస్తుంటుంది. కానీ ఇప్పుడు సినీ జనాలకు ఎన్నడూ లేనంత ఖాళీ దొరికింది. ఈ సమయంలో పర్ఫెక్షన్ కోసం అందరూ ప్రయత్నం చేస్తారనడంలో సందేహం లేదు.
కొత్త కథలు రెడీ చేస్తున్నవాళ్లు డెడ్ లైన్ గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పని చేస్తారు. ఆల్రెడీ సిద్ధం చేసిన కథల్ని మరింత పక్కాగా తీర్చిదిద్దుకుంటారు. ఈ ప్రశాంత, ఆహ్లాద వాతావరణంలో ఆలోచనలు కూడా కచ్చితంగా మెరుగవుతాయి. కొత్త ఆలోచనలు పుడతాయి. ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం మంచి కథలు రెడీ అవుతాయి. అలాగే మేకింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాల విషయానికి వస్తే.. రషెస్ చూసుకుని లోపాలు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మిగతా షూటింగ్ విషయంలో ప్రణాళిక పక్కాగా ఉంటుంది. స్క్రిప్టులో మరిన్ని మంచి మార్పులు జరగొచ్చు.
హీరోలు కూడా ఇంతకుముందులా హడావుడి పడకుండా బోలెడన్ని కథలు విని.. వాటిలో అత్యుత్తమమైన వాటిని ఎంచుకునే అవకాశముంది. ఇంతకుముందు అవకాశం రాని వాళ్లు కథలు వినిపిస్తుండొచ్చు. పక్కన పడేసిన మంచి స్క్రిప్టుల్ని బయటికి తీసి చదవొచ్చు. ఇలా లాక్ డౌన్ తర్వాత సినిమాలు మెరుగ్గా తయారవడానికి మంచి అవకాశాలే ఉంటాయని.. వచ్చే ఏడాది సినిమాల క్వాలిటీ పెరిగి సక్సెస్ రేట్ కూడా పెరగొచ్చని ఆశించవచ్చు.
This post was last modified on April 24, 2020 4:28 am
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…