అల్లు శిరీష్ తన నెక్స్ట్ సినిమాకు సంబందించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. తన కో స్టార్ అంటూ టెడ్డీ బొమ్మను చూపిస్తూ వెనుక స్టిల్ రిలీజ్ చేశాడు. రేపు ఫస్ట్ లుక్ తో మిగతా వివరాలు తెలియజేయనున్నట్లు తెలిపాడు. దీంతో అల్లు శిరీష్ నెక్స్ట్ సినిమా డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కుతుందని, అందులో టెడ్డీ బొమ్మ కీలక పాత్ర పోషించనుందని క్లియర్ గా తెలుస్తుంది. అయితే శిరీష్ చేస్తున్న ఈ సినిమా దేనికైనా రీమేకా ? లేదా డైరెక్ట్ మూవీ ఆ ? అంటూ సోషల్ మీడియాలో ఓ డిస్కషన్ నడుస్తుంది.
ఈ తరహా టెడ్డీ బొమ్మతో తెలుగులో సినిమా రాలేదు. తమిళ్ లో ఆర్య ‘టెడ్డీ’ పేరుతో ఓ సినిమా చేశాడు అది అనుకున్నంత రెస్పాన్స్ అందుకోలేదు. ఇక సందీప్ కిషన్ కూడా బడ్డీ అనే టైటిల్ తో ఈ తరహా కథతో సినిమా మొదలు పెట్టాడు. కానీ అది షూటింగ్ పూర్తయిందా లేదా కూడా ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శిరీష్ ఇలా టెడ్డీ తో సినిమా అంటూ ఎనౌన్స్ చేసే సరికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఇది ఆర్య చేసిన తమిళ సినిమాకు రీమేక్ ఆ ? అనే డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి.
శిరీష్ ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. హిట్ , ఫ్లాప్ పట్టించుకోకుండా ప్రయోగాలు చేస్తుంటాడు. ఇప్పుడు కూడా సరకొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఇది ఏదైనా సినిమాకు రీమేకా ? లేదా ఏదైనా హాలీవుడ్ సినిమా ఇన్స్ పిరేషన్ తో తెరకెక్కుతుందా ? అనేది తెలియాల్సి ఉంది.
This post was last modified on May 30, 2023 12:01 am
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…