జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 20న తన పుట్టిన రోజు నాడే జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరు కాకపోవడంపై పెద్ద చర్చే జరిగింది. ఆ వేడుకల కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ స్వయంగా వెళ్లి తారక్కు ఇన్విటేషన్ ఇవ్వగా.. చాలామంది కలిసి ప్లాన్ చేసుకున్న విదేశీ పర్యటనను ఈ సమయంలో వాయిదా వేసుకోలేనని చెప్పి తారక్ ఈ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు.
ఐతే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కంటే ఫ్యామిలీ ట్రిప్ ముఖ్యం అయిపోయిందా అంటూ తారక్ను చాలామంది విమర్శించారు. కానీ తారక్ కోణంలో చూస్తే ఇదేమీ తప్పు అనిపించదు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు 20వ తారీఖునే పెడతారని.. అందుకు తనను ఆహ్వానిస్తారని అతను అనుకుని ఉండడు కదా? పైగా 22 కుటుంబాలు కలిసి విదేశీ పర్యటనకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక దాన్ని క్యాన్సిల్ చేయడం లేదా వాయిదా వేయడం అంటే చాలామంది ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు రాలేదు కాబట్టి.. తాత మీద తారక్కు ప్రేమాభిమానాలు లేవని అనుకోవడం కరెక్ట్ కాదు అతడి అభిమానుల వాదన. సీనియర్ మీద జూనియర్ అభిమానం ఎలాంటిదో చెప్పడానికి ఒక ఉదాహరణను చెప్పుకోవచ్చు. పుట్టిన రోజును పురస్కరించుకుని ఫారిన్ ట్రిప్ వెళ్లిన తారక్.. 28న తన తాత శత జయంతి కోసమనే కుటుంబంతో కలిసి హైదరాబాద్కు వచ్చాడు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించాడు. ఇంటి దగ్గర వేరే కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. సాయంత్రానికల్లా మళ్లీ ఫ్యామిలీని తీసుకుని ఎయిర్పోర్ట్కు వెళ్లిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్లాడా లేదా.. ఇది వేరే ట్రిప్పా అన్నది తెలియదు కానీ.. అతను మద్యలో హైదరాబాద్కు వచ్చింది మాత్రం తాతకు నివాళి అర్పించడానికే అన్నది స్పష్టం. ఇక తాత పట్ల గౌరవాభిమానాల విషయంలో తారక్ను ఎవ్వరూ శంకించడానికి వీల్లేదంటూ అతడి మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on May 29, 2023 1:31 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…