జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 20న తన పుట్టిన రోజు నాడే జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరు కాకపోవడంపై పెద్ద చర్చే జరిగింది. ఆ వేడుకల కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ స్వయంగా వెళ్లి తారక్కు ఇన్విటేషన్ ఇవ్వగా.. చాలామంది కలిసి ప్లాన్ చేసుకున్న విదేశీ పర్యటనను ఈ సమయంలో వాయిదా వేసుకోలేనని చెప్పి తారక్ ఈ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు.
ఐతే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కంటే ఫ్యామిలీ ట్రిప్ ముఖ్యం అయిపోయిందా అంటూ తారక్ను చాలామంది విమర్శించారు. కానీ తారక్ కోణంలో చూస్తే ఇదేమీ తప్పు అనిపించదు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు 20వ తారీఖునే పెడతారని.. అందుకు తనను ఆహ్వానిస్తారని అతను అనుకుని ఉండడు కదా? పైగా 22 కుటుంబాలు కలిసి విదేశీ పర్యటనకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక దాన్ని క్యాన్సిల్ చేయడం లేదా వాయిదా వేయడం అంటే చాలామంది ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు రాలేదు కాబట్టి.. తాత మీద తారక్కు ప్రేమాభిమానాలు లేవని అనుకోవడం కరెక్ట్ కాదు అతడి అభిమానుల వాదన. సీనియర్ మీద జూనియర్ అభిమానం ఎలాంటిదో చెప్పడానికి ఒక ఉదాహరణను చెప్పుకోవచ్చు. పుట్టిన రోజును పురస్కరించుకుని ఫారిన్ ట్రిప్ వెళ్లిన తారక్.. 28న తన తాత శత జయంతి కోసమనే కుటుంబంతో కలిసి హైదరాబాద్కు వచ్చాడు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించాడు. ఇంటి దగ్గర వేరే కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. సాయంత్రానికల్లా మళ్లీ ఫ్యామిలీని తీసుకుని ఎయిర్పోర్ట్కు వెళ్లిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్లాడా లేదా.. ఇది వేరే ట్రిప్పా అన్నది తెలియదు కానీ.. అతను మద్యలో హైదరాబాద్కు వచ్చింది మాత్రం తాతకు నివాళి అర్పించడానికే అన్నది స్పష్టం. ఇక తాత పట్ల గౌరవాభిమానాల విషయంలో తారక్ను ఎవ్వరూ శంకించడానికి వీల్లేదంటూ అతడి మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…