జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 20న తన పుట్టిన రోజు నాడే జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరు కాకపోవడంపై పెద్ద చర్చే జరిగింది. ఆ వేడుకల కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ స్వయంగా వెళ్లి తారక్కు ఇన్విటేషన్ ఇవ్వగా.. చాలామంది కలిసి ప్లాన్ చేసుకున్న విదేశీ పర్యటనను ఈ సమయంలో వాయిదా వేసుకోలేనని చెప్పి తారక్ ఈ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు.
ఐతే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కంటే ఫ్యామిలీ ట్రిప్ ముఖ్యం అయిపోయిందా అంటూ తారక్ను చాలామంది విమర్శించారు. కానీ తారక్ కోణంలో చూస్తే ఇదేమీ తప్పు అనిపించదు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు 20వ తారీఖునే పెడతారని.. అందుకు తనను ఆహ్వానిస్తారని అతను అనుకుని ఉండడు కదా? పైగా 22 కుటుంబాలు కలిసి విదేశీ పర్యటనకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక దాన్ని క్యాన్సిల్ చేయడం లేదా వాయిదా వేయడం అంటే చాలామంది ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు రాలేదు కాబట్టి.. తాత మీద తారక్కు ప్రేమాభిమానాలు లేవని అనుకోవడం కరెక్ట్ కాదు అతడి అభిమానుల వాదన. సీనియర్ మీద జూనియర్ అభిమానం ఎలాంటిదో చెప్పడానికి ఒక ఉదాహరణను చెప్పుకోవచ్చు. పుట్టిన రోజును పురస్కరించుకుని ఫారిన్ ట్రిప్ వెళ్లిన తారక్.. 28న తన తాత శత జయంతి కోసమనే కుటుంబంతో కలిసి హైదరాబాద్కు వచ్చాడు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించాడు. ఇంటి దగ్గర వేరే కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. సాయంత్రానికల్లా మళ్లీ ఫ్యామిలీని తీసుకుని ఎయిర్పోర్ట్కు వెళ్లిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్లాడా లేదా.. ఇది వేరే ట్రిప్పా అన్నది తెలియదు కానీ.. అతను మద్యలో హైదరాబాద్కు వచ్చింది మాత్రం తాతకు నివాళి అర్పించడానికే అన్నది స్పష్టం. ఇక తాత పట్ల గౌరవాభిమానాల విషయంలో తారక్ను ఎవ్వరూ శంకించడానికి వీల్లేదంటూ అతడి మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on May 29, 2023 1:31 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…