ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మాట్లాడేటప్పుడు చాలా క్యాలికులేటెడ్ గా ఉండాలి. ఏ మాత్రం స్లిప్ అయినా సరే ప్రేక్షకుల అంచనాలు ఒక్కసారిగా రివర్స్ అయిపోతాయి. నిన్న జరిగిన దగ్గుబాటి అభిరాం డెబ్యూ మూవీ అహింస వేడుకలో దర్శకుడు తేజ చేసిన కామెంట్స్ యూనిట్ తో పాటు సగటు అభిమానుల్లో కూడా ఎన్నో అనుమానాలు రేకెత్తించాయి. నిర్మాత సురేష్ బాబు తొంభై శాతం షూటింగ్ పూర్తయ్యాక బాగా రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారని కానీ తాను రామానాయుడుగారికి ఇచ్చిన మాట కోసం పూర్తి చేస్తానని అన్నాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు.
నిజానికి ఇందులో అహింస ఎలా ఉండబోతోందో క్లూ ఇచ్చినట్టే ఉంది. నాయుడుగారి కోరిక మేరకు అభిరాంని పరిచయం చేసే బాధ్యత తీసుకోవడం వరకు ఓకే. అదేదో జయం, చిత్రం, నువ్వు నేను లాగా హిట్టయ్యే కంటెంట్ తీసుకోవచ్చుగా. తాతయ్యగా ఆయన కోరుకున్నది మనవడు సక్సెస్ అవ్వాలని కానీ ఊరికే ఓసారి తెరమీద కనపడితే చాలని కాదుగా. అలాంటప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే మూవీ తీశారని ఫ్యాన్స్ కి చెబితే బాగుంటుంది కానీ ఇలా పబ్లిక్ గా సురేష్ వద్దన్నారు బాలేదని ఓపెన్ గా అనేయడం ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుందనడంలో డౌట్ అక్కర్లేదు
అసలే అహింస మీద ఏ మాత్రం బజ్ లేదు. నిన్న ఈవెంట్ ని మినహాయిస్తే పబ్లిసిటీ మొదలుపెట్టిందే నాలుగైదు రోజుల నుంచి. తేజ అభిరాం హీరోయిన్ కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంకా సురేష్ బాబు లైవ్ లోకి రాలేదు. టైం తక్కువగా ఉంది. వస్తారో లేదో కూడా తెలియదు. ఇన్ని ప్రతికూలతల మధ్య అహింస అటుపక్క బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సర్ తో పాటు మరికొన్ని చిన్న సినిమాలతో పోటీ పడాల్సి ఉంది. ఇవన్నీ చూసుకోకుండా తేజ మనసులో ఉన్నది చెప్పేశారు కానీ ఇప్పుడీ స్పీచ్ పట్లే సురేష్ బాబు, రానా ఇద్దరూ కాస్త గుస్సాగా ఉన్నారట
This post was last modified on May 28, 2023 7:20 pm
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…