ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మాట్లాడేటప్పుడు చాలా క్యాలికులేటెడ్ గా ఉండాలి. ఏ మాత్రం స్లిప్ అయినా సరే ప్రేక్షకుల అంచనాలు ఒక్కసారిగా రివర్స్ అయిపోతాయి. నిన్న జరిగిన దగ్గుబాటి అభిరాం డెబ్యూ మూవీ అహింస వేడుకలో దర్శకుడు తేజ చేసిన కామెంట్స్ యూనిట్ తో పాటు సగటు అభిమానుల్లో కూడా ఎన్నో అనుమానాలు రేకెత్తించాయి. నిర్మాత సురేష్ బాబు తొంభై శాతం షూటింగ్ పూర్తయ్యాక బాగా రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారని కానీ తాను రామానాయుడుగారికి ఇచ్చిన మాట కోసం పూర్తి చేస్తానని అన్నాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు.
నిజానికి ఇందులో అహింస ఎలా ఉండబోతోందో క్లూ ఇచ్చినట్టే ఉంది. నాయుడుగారి కోరిక మేరకు అభిరాంని పరిచయం చేసే బాధ్యత తీసుకోవడం వరకు ఓకే. అదేదో జయం, చిత్రం, నువ్వు నేను లాగా హిట్టయ్యే కంటెంట్ తీసుకోవచ్చుగా. తాతయ్యగా ఆయన కోరుకున్నది మనవడు సక్సెస్ అవ్వాలని కానీ ఊరికే ఓసారి తెరమీద కనపడితే చాలని కాదుగా. అలాంటప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే మూవీ తీశారని ఫ్యాన్స్ కి చెబితే బాగుంటుంది కానీ ఇలా పబ్లిక్ గా సురేష్ వద్దన్నారు బాలేదని ఓపెన్ గా అనేయడం ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుందనడంలో డౌట్ అక్కర్లేదు
అసలే అహింస మీద ఏ మాత్రం బజ్ లేదు. నిన్న ఈవెంట్ ని మినహాయిస్తే పబ్లిసిటీ మొదలుపెట్టిందే నాలుగైదు రోజుల నుంచి. తేజ అభిరాం హీరోయిన్ కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంకా సురేష్ బాబు లైవ్ లోకి రాలేదు. టైం తక్కువగా ఉంది. వస్తారో లేదో కూడా తెలియదు. ఇన్ని ప్రతికూలతల మధ్య అహింస అటుపక్క బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సర్ తో పాటు మరికొన్ని చిన్న సినిమాలతో పోటీ పడాల్సి ఉంది. ఇవన్నీ చూసుకోకుండా తేజ మనసులో ఉన్నది చెప్పేశారు కానీ ఇప్పుడీ స్పీచ్ పట్లే సురేష్ బాబు, రానా ఇద్దరూ కాస్త గుస్సాగా ఉన్నారట
This post was last modified on May 28, 2023 7:20 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…