పాన్ ఇండియా స్టార్లు అయిపోవాలని చాలామందికి ఉంటుంది. కానీ మన ఇండస్ట్రీలో ఎంతో కాలంగా పెద్ద స్టార్లుగా వెలుగొందుతున్న హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయికి వెళ్లలేకపోయారు. కానీ నిఖిల్ అనే చిన్న స్థాయి యంగ్ హీరో.. ‘కార్తికేయ-2’ సినిమాతో ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్లిపోయాడు. హిందీలో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన సినిమా సంచలన వసూళ్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిపోయింది.
దీని తర్వాత నిఖిల్ తన కెరీర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ ‘స్పై’ అనే పాన్ ఇండియా మూవీ చేశాడు. ఈ మధ్యే దాని టీజర్ లాంచ్ అయింది. దేశభక్తితో ముడిపడ్డ ఆ కథ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలాగే ఉంది. దీని తర్వాత నిఖిల్ మరో పాన్ ఇండియా మూవీని లైన్లో పెట్టాడు. అదే.. ‘ది ఇండియా హౌస్’. ఈ రోజే ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
ఈ సినిమాకు అనేక విశిష్టతలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యువి క్రియేషన్స్’తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతులు కలిపి కొత్త, యువ టాలెంట్ను ప్రోత్సహించడం కోసం నెలకొల్పిన ‘వి మెగా’ పిక్చర్స్లో తెరకెక్కుతున్న తొలి చిత్రమిది. ‘కార్తికేయ-2’, ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలతో సంచలనం రేపిన అభిషేక్ అగర్వాల్ కూడా ఈ సినిమా కోసం వీరితో అసోసియేట్ అవుతున్నాడు.
‘ది ఇండియా హౌస్’ను రామ్ వంశీ కృష్ణ రూపొందించనున్నాడు. ఇది స్వాతంత్ర్యానికి పూర్వం 1905 ప్రాంతంలో జరిగే కథ కావడం విశేషం. సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా లాంచ్ చేసిన టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. సినిమా చాలా రిచ్గా ఉంటుందన్న సంకేతాలు కనిపించాయి ఈ టీజర్లో. ఈ సినిమా వెనుక ఉన్న పేర్లు చూస్తే.. బడ్జెట్, ప్రమోషన్ అదీ కూడా వేరే లెవెల్లో ఉండబోతుందన్నది స్పష్టం. ఈ సినిమా క్లిక్ అయితే నిఖిల్ కెరీర్ వేరే లెవెల్కు వెళ్లిపోవడం ఖాయం.
This post was last modified on May 28, 2023 1:48 pm
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…