Movie News

శత జయంతి ప్రోగ్రాంకు రమ్మంటే తారక్ అలా చెప్పాడు

నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల్ని నిర్వహిస్తున్న సందర్భంగా.. ఇటీవల హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి అక్కినేని కుటుంబానికి చెందిన వారు.. మెగా ఫ్యామిలీ నుంచి రాంచరణ్ తో పాటు.. పలువురు నటులు.. నటీమణులు హాజరయ్యారు. అందరూ వచ్చినా.. తారక్ మాత్రం గైర్హాజరు అయ్యారు.

తన పుట్టిన రోజు కావటంతో కుటుంబంతో తాను వేరే ప్రోగ్రాంకు అటెండ్ కావాలంటూ చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై తాజాగా ఒక మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్. తాజాగా ఆయన చెప్పిన మాటలు.. జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉండటమే కాదు.. ఆయన తప్పు చేశారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

హైదరాబాద్ లో తాము నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమానికి బాలక్రిష్ణ.. రామ్ చరణ్.. నాగ చైతన్య.. వెంకటేశ్ దగ్గుబాటి.. శ్రీలీలా ఇలా చాలామంది వచ్చారని.. ఎన్టీఆర్ మాత్రం రాలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ ఎందుకు రాలేదన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఏదో టూర్ పెట్టుకున్నారని బదులిచ్చారు. తాను నందమూరి రామక్రిష్ణను తారక్ ను కలవాలని అడిగితే.. అడిగిన వారం తర్వాత మాకు అపాయింట్ మెంట్ వచ్చింది. వెళ్లి కలిశాం. నాకు ఆ రోజు టూర్ ఉంది అన్నా.. 22 కుటుంబాలు కలిసి వెళుతున్నాం.. రాలేను అని చెప్పాడు.

అప్పుడు మేము.. నీ పుట్టినరోజులు ముందు ముందు చాలా వస్తాయి. కానీ.. అన్నగారి శతజయంతి ఒక్కసారే వస్తుందని చెప్పాం. ఉదయం అభిమానుల్ని కలిసేందుకు ఉంటానని చెప్పాడు. ఎలాగు ఉదయం ఉంటారు కదా. సాయంత్రం వరకు ఉండి ఆ ఫంక్షన్ కు వచ్చి వెళ్లండని చెప్పాము” అని ఏం జరిగిందో వివరించారు.
కానీ.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన కుటుంబ టూర్ కు ప్రాధాన్యత ఇచ్చి.. తాతగారి ఫంక్షన్ కు డుమ్మా కొట్టారన్నారు. వందో పుట్టిన రోజు ఒక్కసారే వస్తుందని.. అది ఘనంగా చేసినప్పుడే అందరితో పాటు తారక్ ఉండి ఉంటే మంచి పేరు వచ్చేదన్నారు. ఎన్టీఆర్ తో పాటు కల్యాణ్ రామ్ కూడా ఫంక్షన్ కు రాలేదు కదా? అంటే.. అతను కూడా తారక్ తో పాటు టూర్ కు వెళ్లి ఉండొచ్చు. అందుకే రాలేదేమో? అంటూ టీడీపీ నేత జనార్ధన్ చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

This post was last modified on May 28, 2023 11:29 am

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

3 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

7 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

11 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

11 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

12 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

12 hours ago