నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల్ని నిర్వహిస్తున్న సందర్భంగా.. ఇటీవల హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి అక్కినేని కుటుంబానికి చెందిన వారు.. మెగా ఫ్యామిలీ నుంచి రాంచరణ్ తో పాటు.. పలువురు నటులు.. నటీమణులు హాజరయ్యారు. అందరూ వచ్చినా.. తారక్ మాత్రం గైర్హాజరు అయ్యారు.
తన పుట్టిన రోజు కావటంతో కుటుంబంతో తాను వేరే ప్రోగ్రాంకు అటెండ్ కావాలంటూ చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై తాజాగా ఒక మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్. తాజాగా ఆయన చెప్పిన మాటలు.. జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉండటమే కాదు.. ఆయన తప్పు చేశారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
హైదరాబాద్ లో తాము నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమానికి బాలక్రిష్ణ.. రామ్ చరణ్.. నాగ చైతన్య.. వెంకటేశ్ దగ్గుబాటి.. శ్రీలీలా ఇలా చాలామంది వచ్చారని.. ఎన్టీఆర్ మాత్రం రాలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ ఎందుకు రాలేదన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఏదో టూర్ పెట్టుకున్నారని బదులిచ్చారు. తాను నందమూరి రామక్రిష్ణను తారక్ ను కలవాలని అడిగితే.. అడిగిన వారం తర్వాత మాకు అపాయింట్ మెంట్ వచ్చింది. వెళ్లి కలిశాం. నాకు ఆ రోజు టూర్ ఉంది అన్నా.. 22 కుటుంబాలు కలిసి వెళుతున్నాం.. రాలేను అని చెప్పాడు.
అప్పుడు మేము.. నీ పుట్టినరోజులు ముందు ముందు చాలా వస్తాయి. కానీ.. అన్నగారి శతజయంతి ఒక్కసారే వస్తుందని చెప్పాం. ఉదయం అభిమానుల్ని కలిసేందుకు ఉంటానని చెప్పాడు. ఎలాగు ఉదయం ఉంటారు కదా. సాయంత్రం వరకు ఉండి ఆ ఫంక్షన్ కు వచ్చి వెళ్లండని చెప్పాము” అని ఏం జరిగిందో వివరించారు.
కానీ.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన కుటుంబ టూర్ కు ప్రాధాన్యత ఇచ్చి.. తాతగారి ఫంక్షన్ కు డుమ్మా కొట్టారన్నారు. వందో పుట్టిన రోజు ఒక్కసారే వస్తుందని.. అది ఘనంగా చేసినప్పుడే అందరితో పాటు తారక్ ఉండి ఉంటే మంచి పేరు వచ్చేదన్నారు. ఎన్టీఆర్ తో పాటు కల్యాణ్ రామ్ కూడా ఫంక్షన్ కు రాలేదు కదా? అంటే.. అతను కూడా తారక్ తో పాటు టూర్ కు వెళ్లి ఉండొచ్చు. అందుకే రాలేదేమో? అంటూ టీడీపీ నేత జనార్ధన్ చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
This post was last modified on May 28, 2023 11:29 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…