నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల్ని నిర్వహిస్తున్న సందర్భంగా.. ఇటీవల హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి అక్కినేని కుటుంబానికి చెందిన వారు.. మెగా ఫ్యామిలీ నుంచి రాంచరణ్ తో పాటు.. పలువురు నటులు.. నటీమణులు హాజరయ్యారు. అందరూ వచ్చినా.. తారక్ మాత్రం గైర్హాజరు అయ్యారు.
తన పుట్టిన రోజు కావటంతో కుటుంబంతో తాను వేరే ప్రోగ్రాంకు అటెండ్ కావాలంటూ చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై తాజాగా ఒక మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్. తాజాగా ఆయన చెప్పిన మాటలు.. జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉండటమే కాదు.. ఆయన తప్పు చేశారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
హైదరాబాద్ లో తాము నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమానికి బాలక్రిష్ణ.. రామ్ చరణ్.. నాగ చైతన్య.. వెంకటేశ్ దగ్గుబాటి.. శ్రీలీలా ఇలా చాలామంది వచ్చారని.. ఎన్టీఆర్ మాత్రం రాలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ ఎందుకు రాలేదన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఏదో టూర్ పెట్టుకున్నారని బదులిచ్చారు. తాను నందమూరి రామక్రిష్ణను తారక్ ను కలవాలని అడిగితే.. అడిగిన వారం తర్వాత మాకు అపాయింట్ మెంట్ వచ్చింది. వెళ్లి కలిశాం. నాకు ఆ రోజు టూర్ ఉంది అన్నా.. 22 కుటుంబాలు కలిసి వెళుతున్నాం.. రాలేను అని చెప్పాడు.
అప్పుడు మేము.. నీ పుట్టినరోజులు ముందు ముందు చాలా వస్తాయి. కానీ.. అన్నగారి శతజయంతి ఒక్కసారే వస్తుందని చెప్పాం. ఉదయం అభిమానుల్ని కలిసేందుకు ఉంటానని చెప్పాడు. ఎలాగు ఉదయం ఉంటారు కదా. సాయంత్రం వరకు ఉండి ఆ ఫంక్షన్ కు వచ్చి వెళ్లండని చెప్పాము” అని ఏం జరిగిందో వివరించారు.
కానీ.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన కుటుంబ టూర్ కు ప్రాధాన్యత ఇచ్చి.. తాతగారి ఫంక్షన్ కు డుమ్మా కొట్టారన్నారు. వందో పుట్టిన రోజు ఒక్కసారే వస్తుందని.. అది ఘనంగా చేసినప్పుడే అందరితో పాటు తారక్ ఉండి ఉంటే మంచి పేరు వచ్చేదన్నారు. ఎన్టీఆర్ తో పాటు కల్యాణ్ రామ్ కూడా ఫంక్షన్ కు రాలేదు కదా? అంటే.. అతను కూడా తారక్ తో పాటు టూర్ కు వెళ్లి ఉండొచ్చు. అందుకే రాలేదేమో? అంటూ టీడీపీ నేత జనార్ధన్ చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
This post was last modified on May 28, 2023 11:29 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…