Movie News

హిడింబ హింసలో పీరియాడిక్ టచ్

స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా అశ్విన్ బాబు హీరోగా అడపాదడపా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ వాటికి సరైన ఫలితాలే అందుకోలేకపోతున్నాడు. అన్నయ్య ఎంతో చేయూత ఇచ్చి జీనియస్ నుంచి రాజుగారి గది 3 వరకు అవకాశాలు ఇస్తూ వచ్చాడు కానీ కుర్రాడికి మాత్రం సోలో హిట్టు పడటం లేదు. ఇన్నేళ్లకు ఓ డిఫరెంట్ జానర్ తో వచ్చే ప్రయత్నం చేశాడు. అదే హిడింబ. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణతో అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లర్ తాలూకు ట్రైలర్ ని నిన్న సాయిధరమ్ తేజ్ అతిధిగా హైదరాబాద్ లో గ్రాండ్ లాంచ్ చేశారు.

కాన్సెప్ట్ ఏదో డిఫరెంట్ గానే ఉంది. నగరంలో వరసగా అమ్మాయిల హత్యలు జరుగుతూ ఉంటాయి. హంతకుడికి ఎరుపు రంగుతో ఏదో కనెక్షన్ ఉంటుంది. కేవలం ఆ కలర్ ని ధరించిన వాళ్లను మాత్రమే అతి కిరాతకంగా మర్డర్ చేస్తూ ఉంటాడు . కేసుని ఛేదించడానికి బరిలో దిగిన  ఇన్స్ పెక్టర్(అశ్విన్ బాబు), అతని లేడీ కొలీగ్(నందితా శ్వేతా)కు ఎలాంటి క్లూస్ దొరక్క తీవ్రంగా శోధిస్తుంటారు. దీనికి 1908లో బే అఫ్ బెంగాల్ ఒడ్డున బ్రిటిషర్లు చేసిన భారతీయుల ఊచకోతకు సంబంధించిన కీలక ఆధారాలు దొరుకుతాయి. అవేంటనేది తెరమీద చూస్తే కానీ సస్పెన్స్ వీడదు

విజువల్స్ చాలా వయొలెంట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇలాంటి సైకో కిల్లర్ బ్యాక్ డ్రాప్ కొత్త కాకపోయినా హిడింబ నేపధ్యం, వందేళ్ల క్రితం జరిగిన సంఘటన తాలూకు రిఫరెన్స్ ఇవన్నీ ఆసక్తి రేపుతున్నాయి. వికాస్ బడిసా సంగీతం, రాజశేఖర్ ఛాయాగ్రహణం మంచి క్వాలిటీని ఇచ్చాయి. హైప్ ని తేవడంలో దర్శకుడు అనీల్ కన్నెగంటి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సస్పెన్స్ ఫ్యాక్టర్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. హింసతో కూడిన ఇంటెన్సిటీ గట్టిగానే ఉంది. ఇంకా విడుదల తేదీ ఖారారు కాని హిడింబతో అయినా అశ్విన్ సోలో హీరోగా హిట్టు కొడతాడేమో చూడాలి.

This post was last modified on May 28, 2023 12:00 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

2 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

3 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

4 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

5 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

5 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

7 hours ago