కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణా కాంగ్రెస్ సీనియర్లపై బాగానే ప్రభావం చూపుతున్నట్లుంది. అందుకనే కొంతకాలంగా గాంధీభవన్ మొహంకూడా చూడని కొందరు సీనియర్లు ఇపుడు రెగ్యులర్ గా కనబడుతున్నారు. మరికొందరు సీనియర్లు తరచూ మీడియా ముందుకొచ్చి గట్టిగా తన వాయిస్ వినిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళంతా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద కోపంలో పార్టీకి దూరంగా ఉంటున్న వాళ్ళే. ఇక మరికొందరు నేతలైతే ఇప్పటికే పాదయాత్ర చేస్తుంటే ఒకళ్ళిద్దరు పాదయాత్రలకు రెడీ అవుతున్నారు.
చాలాకాలంగా పార్టీకి సీనియర్ నేత జానారెడ్డి దూరంగా ఉంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు బదులు కొడుకు పోటీ చేస్తారని గతంలోనే ప్రకటించేశారు. అలాంటి జానారెడ్డి ఇపుడు సడెన్ గా మళ్ళీ కండువా కప్పుకుని గాంధీభవన్లో ప్రత్యక్షమయ్యారు. దీనికి కారణం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకం పెరగటమేనట. ఇక మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా చాలాకాలం పార్టీ యాక్టివిటీసలో అంత బిజీగా లేరనే చెప్పాలి. అలాంటిది పొన్నాల కూడా ఇపుడు పార్టీ ఆఫీసులో కనబడుతున్నారు.
ఇక వచ్చేఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేది లేదన్నట్లుగా ఇంతకాలం డైలాగులు చెబుతున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాబోయే ఎన్నికల్లో పార్టీ 80 సీట్లతో అధికారంలోకి రావటం ఖాయమంటున్నారు. తాను జిల్లా అంతా తొందరలోనే పాదయాత్రలు చేయబోతున్నట్లు చెప్పారు. గతంలో కూడా ఇదేమాట చెప్పిన ఎంపీ ఇంతవరకు పాదయాత్ర జోలికే వెళ్ళలేదు. ఇక సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క అయితే కొద్దిరోజులుగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్రలో భాగంగా భట్టీ మధ్యలో బలప్రదర్శనకు కూడా దిగుతున్నారు.
ఇక మరో సీనియర్ జగ్గారెడ్డి కూడా పాదయాత్ర చేస్తానంటు ప్రకటిస్తున్నారు. జగ్గారెడ్డి కూడా పార్టీని వదిలేస్తారని ఆమధ్య ప్రచారం బాగా జరిగింది. అయితే కర్నాటకలో గెలుపుతో అంతా సర్దుకున్నారు. పీసీసీ చీఫ్ అయినదగ్గర నుండి రేవంత్ రెగ్యులర్ గా పాదయాత్రలు, సభలు, సమావేశాలు పెడుతునే ఉన్నారు. రేవంత్ పార్టీ పగ్గాలు తీసుకున్నతర్వాత పార్టీ క్యాడర్లో మంచి స్పీడు వచ్చిందన్నది వాస్తవం. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పటం, సరదాగా మాట్లాడటం, ఆర్ధిక, అంగబలం అపారంగా ఉండటం రేవంత్ కు బలమన్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి సీనియర్లంతా ఒక్కసారిగా యాక్టివ్ అవ్వటం పార్టీకి మంచిదే కదా.
This post was last modified on May 27, 2023 9:47 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…