ఒకప్పుడు టాలీవుడ్లో చాలా ప్రామిసింగ్గా కనిపించిన యువ కథానాయకుల్లో ఉదయ్ కిరణ్ ఒకడు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో వరుస హిట్లు కొట్టి పెద్ద స్టార్ అయ్యేలా కనిపించాడు ఉదయ్. కానీ తర్వాత తర్వాత సరైన సినిమాలు చేయకపోవడంతో ఫేడవుట్ అయిపోయాడు. చివరికి సినిమాల్లో అవకాశాలు లేకో, ఇంకేదో అసంతృప్తితోనో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులకు పెద్ద షాక్.
ఉదయ్ సుసైడ్ నోట్ అంటూ ఏదీ రాయకపోవడంతో అతడి ఆత్మహత్యకు ఇదీ కారణం అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఐతే ఉదయ్ను స్టార్ను చేసిన సీనియర్ దర్శకుడు తేజ మాత్రం.. అతనెందుకు చనిపోయాడో తెలుసని, సరైన సమయంలో ఆ విషయం వెల్లడిస్తానని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనం రేపింది. తాజాగా మరో ఇంటర్వ్యూలో ఆ విషయాన్నే ప్రస్తావిస్తే.. తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ గురించి తెలిసిన వాళ్లు కూడా ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారని తేజ వ్యాఖ్యానించారు. ‘‘దాని గురించి నేను చెబుతాను. కానీ కొంతమంది ‘మీరే చెప్పండి’ అంటూ అమాయకంగా యాక్ట్ చేస్తున్నారు’’ అని తేజ అన్నారు. ఉదయ్ కిరణ్ గురించి ఒక్క మాటలో చెప్పమని ఈ ఇంటర్వ్యూలో అడిగితే ‘‘పాపం’’ అని బదులిచ్చాడు తేజ.
ఇదిలా ఉండగా తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. తన కొడుకును త్వరలోనే హీరోగా పరిచయం చేయనున్నానని.. అతను యాక్టింగ్, డైరెక్షన్ కోర్సులు కూడా పూర్తి చేశాడని తేజ తెలిపాడు. తన కూతురు ఫారిన్లో చదువుకుందని.. ఆమెకు పెళ్లి చేసే ఉద్దేశం తనకు లేదని.. ఎవరైనా నచ్చారని చెబితే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకురమ్మని తెలిసిన వాళ్లకు భోజనాలు పెట్టిస్తానని తేజ తేల్చేశాడు. పెళ్లి తర్వాత భర్తతో పొసగకపోతే నిమిషం కూడా ఆలోచించకుండా విడాకులు ఇచ్చేయాలని కూడా తాను తన కూతురికి సూచించినట్లు తేజ వెల్లడించడం విశేషం.
This post was last modified on May 26, 2023 1:43 pm
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…