ఈ సోషల్ మీడియా కాలంలో ప్రతి విషయాన్నీ సెన్సేషనల్ చేయడానికి చూసే నెటిజన్ల బ్యాచ్ ఒకటి ఉంటుంది. వీళ్లకు సెలబ్రెటీలను బతికుండగానే చంపేసి.. ఆ వార్తలను వైరల్ చేసుకుని పాపులర్ అవ్వడం ఒక ఆట. ఇలాంటి వార్తలు ఆ సెలబ్రెటీలను, వారి కుటుంబీకులను ఎంతగా బాధ పెడతాయో కాస్తయినా ఆలోచించరు. వేణుమాధవ్, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, శరత్ బాబు.. ఇలా ఎంతోమంది సెలబ్రెటీలు ఈ బాధను అనుభవించిన వారే.
శరత్ బాబు ఈ మధ్య విషమ స్థితికి చేరుకోగా.. ఆయన బతికుండగానే చనిపోయినట్లు పేరున్న హ్యాండిల్స్ కూడా ట్వీట్లు వేసేశాయి. తర్వాత ఆ వార్త నిజం కాదని తెలిసింది. రెండు రోజుల కిందట శరత్ బాబు నిజంగానే చనిపోయినా జనాలు నమ్మని పరిస్థితి వచ్చిందంటే.. అందుకు అంతకుముందు జరిగిన అబద్ధపు ప్రచారమే కారణం. శరత్ బాబు అనుభవం తర్వాత ఇంతలోనే మరో సెలబ్రెటీకి చేదు అనుభవం తప్పలేదు.
90వ దశకంలో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన సీనియర్ కమెడియన్ సుధాకర్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఆయన స్వయంగా తాను బతికే ఉన్నానంటూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. సుధాకర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. ఆయన ఐసీయూలో ఉన్నారని ముందు వార్తలు రాగా.. ఆ తర్వాత ఆయన చనిపోయినట్లు ఎవరో వార్తలు పుట్టించారు.
దీనిపై ఒక వీడియో ద్వారా సుధాకర్ వివరణ ఇచ్చారు. తన గురించి వస్తున్న వార్తలు నమ్మకండని.. తాను ఆరోగ్యంగా, సంతోషంగానే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఒక పదేళ్ల పాటు తెలుగు సినిమా కామెడీలో తనదైన ముద్ర వేసిన సుధాకర్.. ఆ తర్వాత డౌన్ అయిపోయారు. మధ్యలో తాగుడుకు బానిస అయి ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
This post was last modified on May 25, 2023 4:45 pm
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…
ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏదో ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారుతుంటారు. కొందరిని హర్ట్ చేసేలా మాట్లాడతారు. ఐతే తాము…
ఏపీలో రాజకీయాలు ఊపందుకున్న నేపథ్యంలో సంచలనాలు కూడా అదే రేంజ్లో తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన పార్టీలన్నీ కూడా.. పెద్ద…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే బూతులు. మంత్రులూ, ఎమ్మెల్యేలు తేడా లేకుండా విపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడే తీరు రాజకీయాలంటేనే…
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగింది. వైసీపీ వర్సెస్ బీజేపీ కార్యకర్త ల మధ్య…