హారర్ జానర్ లో రూపొందినా బ్లాక్ బస్టర్ వసూళ్లతో వంద కోట్ల గ్రాస్ సాధించిన విరూపాక్ష ఇటీవలే ఓటిటిలో వచ్చేసి థియేట్రికల్ గా ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. కొన్ని చోట్ల డీసెంట్ రెవిన్యూ వస్తున్నా అదేమీ భారీ మొత్తం కాదు. దీనికి సంబంధించిన కొన్ని కీలక విషయాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. తాజాగా దర్శకుడు కార్తీక్ దండు విరూపాక్ష స్క్రిప్ట్ లో సుకుమార్ చేసిన మార్పుల గురించి అవి ఫైనల్ అవుట్ ఫుట్ లో ఎంత దోహదపడ్డాయో వివరించి చెప్పడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది.
ఒక సీనియర్ అనుభవం ఏ రేంజ్ లో ఉపయోగపడుతుందో అర్థం చేసుకుంటున్నారు. ఈ సినిమాలో చేతబడులు చేస్తున్న అసలు విలన్ ఎవరనేది క్లైమాక్స్ వరకు ఎక్కడా రివీల్ చేయకుండా హఠాత్తుగా హీరోయిన్ సంయుక్త మీననే ఇదంతా చేసిందని చూపించడం ఆడియన్స్ ని షాక్ కి గురి చేసింది.
వాస్తవానికి కార్తీక్ ముందు రాసుకున్నది పార్వతి క్యారెక్టర్ చేసిన యాంకర్ శ్యామలని విలన్ ని చేయడం. ఆ ప్రకారమే ట్రీట్ మెంట్ సిద్ధం చేసుకున్నారు. అలా అయితే పెద్దగా ఇంపాక్ట్ ఉండదని, చూసేవాళ్ళకు ఊహాతీతంగా ఉండాలంటే నందినికి ట్విస్టు పెట్టడమే కరెక్టని గుర్తించి దానికి అనుగుణంగా స్క్రీన్ ప్లే మార్చడంతో టోటల్ టోన్ మారిపోయింది
ఒకవేళ శ్యామలనే విలన్ గా చూపించి ఉంటే సుకుమార్ చెప్పినట్టు ఇంత థ్రిల్ ఖచ్చితంగా దక్కేది కాదు. పైగా చివరి ఘట్టంలో వచ్చే సీన్లు ఈ స్థాయిలో పండకపోయేవి. ఇదంతా గెస్ చేయగలిగారు కాబట్టి సుక్కు మార్కు విరూపాక్షలో బలంగా పని చేసింది. ఏది ఏమైనా ఇలాంటి హారర్ థ్రిల్లర్స్ లో అసలు హంతకులు ఎవరన్నది ముందే పసిగట్టకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో విరూపాక్ష టీమ్ వంద శాతం సక్సెస్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చాక వ్యూస్ భారీగా వస్తున్నాయట. కార్తీక్ దండు సీక్వెల్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు.
This post was last modified on May 25, 2023 11:13 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…