మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఒక ఫస్ట్ లుక్ లాంచ్ కోసం ఏకంగా రాజమండ్రి బ్రిడ్జ్ ని లాక్ చేయడంతో పాటు రైలుబండిని ఆపి మరీ అంతెత్తు నుంచి బ్యానర్ ని వందలాది ఫ్యాన్స్, మీడియా ప్రతినిధులు చూస్తుండగా వదలడం ఇదే మొదటిసారని చెప్పాలి. రెగ్యులర్ గా హైదరాబాద్ లో జరిగే సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ ఈసారి రాజమహేంద్రవరంలో చేశారు. అక్టోబర్ 20న విడుదల కాబోతున్న ఈ సినిమా థీమ్ ఏంటో విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ లో రివీల్ చేస్తూ రవితేజని చూపించారు.
1970 ప్రాంతంలో దక్షిణాది భారతదేశం మొత్తం భయపడిన ఊరు స్టువర్ట్ పురం. అక్కడ పేరు మోసిన గజదొంగ నాగేశ్వరరావు. అందరూ అతన్ని టైగర్ అని పిలుస్తూ ఉంటారు. దోపిడీలకు పెట్టింది పేరైన ఆ ప్రాంతంలో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. మైలురాయి ఒక కిలోమీటర్ ఉండగానే ట్రైన్ వణికిపోతుంది. అంతగా దాడులు జరుగుతాయి. అసలు వాళ్లంతా ఎందుకు ఇలా చోరీలకు తెగబడ్డారు, నాగేశ్వరరావు అంతగా గుర్తింపు తెచ్చుకోవడానికి దోహదం చేసిన కారణాలు, సంఘటనలు, ప్రభుత్వాలు ఏం చేశాయన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఇంకో అయిదు నెలలు ఆగాల్సిందే
జస్ట్ ఫస్ట్ లుక్ కాబట్టి ఎక్కువ డీటెయిల్స్, క్యాస్టింగ్ ని రివీల్ చేయలేదు . ఇంకా చాలా టైం ఉంది కనక దీంతో సరిపెట్టారు. నోటి పళ్ళ మధ్యలో ఊచలు పెట్టుకుని చూస్తూన్న రవితేజ లుక్, పులుల్ని వేటాడే పులిని చూశారా అంటూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ కి మంచి ఊపిచ్చేలా ఉన్నాయి. పీరియడ్ డ్రామా కావడంతో అప్పటి వాతావరణాన్ని చక్కగా ప్రెజెంట్ చేశారు వంశీ. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మాస్ రాజా అసలైన గెటప్ ఇంకా షాకింగ్ గా ఉండబోతుంది. దాన్ని పూర్తిగా చూపించలేదు. బోలెడు సమయం ఉందిగా
This post was last modified on May 25, 2023 6:48 am
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…
టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ హీరోల్లో తిరువీర్ ఒకడు. పాపం…
ఎప్పుడో 2019 వన్డే ప్రపంచకప్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాతి ఏడాది అధికారికంగా ఇంటర్నేషనల్…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ…
జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం…
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…