మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఒక ఫస్ట్ లుక్ లాంచ్ కోసం ఏకంగా రాజమండ్రి బ్రిడ్జ్ ని లాక్ చేయడంతో పాటు రైలుబండిని ఆపి మరీ అంతెత్తు నుంచి బ్యానర్ ని వందలాది ఫ్యాన్స్, మీడియా ప్రతినిధులు చూస్తుండగా వదలడం ఇదే మొదటిసారని చెప్పాలి. రెగ్యులర్ గా హైదరాబాద్ లో జరిగే సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ ఈసారి రాజమహేంద్రవరంలో చేశారు. అక్టోబర్ 20న విడుదల కాబోతున్న ఈ సినిమా థీమ్ ఏంటో విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ లో రివీల్ చేస్తూ రవితేజని చూపించారు.
1970 ప్రాంతంలో దక్షిణాది భారతదేశం మొత్తం భయపడిన ఊరు స్టువర్ట్ పురం. అక్కడ పేరు మోసిన గజదొంగ నాగేశ్వరరావు. అందరూ అతన్ని టైగర్ అని పిలుస్తూ ఉంటారు. దోపిడీలకు పెట్టింది పేరైన ఆ ప్రాంతంలో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. మైలురాయి ఒక కిలోమీటర్ ఉండగానే ట్రైన్ వణికిపోతుంది. అంతగా దాడులు జరుగుతాయి. అసలు వాళ్లంతా ఎందుకు ఇలా చోరీలకు తెగబడ్డారు, నాగేశ్వరరావు అంతగా గుర్తింపు తెచ్చుకోవడానికి దోహదం చేసిన కారణాలు, సంఘటనలు, ప్రభుత్వాలు ఏం చేశాయన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఇంకో అయిదు నెలలు ఆగాల్సిందే
జస్ట్ ఫస్ట్ లుక్ కాబట్టి ఎక్కువ డీటెయిల్స్, క్యాస్టింగ్ ని రివీల్ చేయలేదు . ఇంకా చాలా టైం ఉంది కనక దీంతో సరిపెట్టారు. నోటి పళ్ళ మధ్యలో ఊచలు పెట్టుకుని చూస్తూన్న రవితేజ లుక్, పులుల్ని వేటాడే పులిని చూశారా అంటూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ కి మంచి ఊపిచ్చేలా ఉన్నాయి. పీరియడ్ డ్రామా కావడంతో అప్పటి వాతావరణాన్ని చక్కగా ప్రెజెంట్ చేశారు వంశీ. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మాస్ రాజా అసలైన గెటప్ ఇంకా షాకింగ్ గా ఉండబోతుంది. దాన్ని పూర్తిగా చూపించలేదు. బోలెడు సమయం ఉందిగా
This post was last modified on May 25, 2023 6:48 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…