పవిత్ర లోకేష్.. కొన్నేళ్ల ముందు వరకు ఈ కన్నడ క్యారెక్టర్ నటి పేరు కూడా చాలామందికి తెలియదు. సీనియర్ నటుడు నరేష్తో ఆమె బంధం చర్చనీయాంశంగా ఆమెకు వచ్చిన పాపులారిటీనే వేరు. ‘సమ్మోహనం’ సినిమాలో భార్యాభర్తలుగా కలిసి నటించిన సమయంలో వీరి మధ్య స్నేహం మొదలైంది. తర్వాత ఇద్దరూ కలిసి ప్రయాణం సాగిస్తున్నారు.
అధికారికంగా ఇద్దరికీ పెళ్లి జరిగిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు కానీ.. వాళ్లయితే అందరికీ భార్యాభర్తల్లాగే కనిపిస్తున్నారు. తన మొదటి భర్తకు దూరమైన పవిత్ర.. తన నివాసాన్ని కూడా హైదరాబాద్కే మార్చేసింది. నరేష్తో కలిసి ఆమె నటించిన ‘మళ్ళీ పెళ్ళి’ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వీరి నిజ జీవిత బంధం నేపథ్యంలోనే ఈ సినిమా సాగినట్లు కనిపిస్తుండటం అందుకు కారణం.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసి పవిత్ర.. నరేష్ తన జీవితంలోకి వచ్చాక జరిగిన ముఖ్యమైన మార్పుల గురించి మాట్లాడింది. ఒక దశలో తాను ఆత్మ:హత్య చేసుకోవాలని కూడా చూశానని.. అలాంటి తన ఆలోచనలను పూర్తిగా మార్చి.. మళ్లీ సంతోషంగా జీవించేలా చేసింది నరేషే అని ఆమె వెల్లడించింది. ‘‘నరేష్ ఎంత సీరియస్ విషయమైనా తేలిగ్గా తీసుకుంటారు. దాన్నుంచి బయటపడేందుకు సీరియస్గా ఆలోచిస్తారు.
కానీ నేను చిన్న చిన్న విషయాలను కూడా సీరియస్గా తీసుకునే రకం. నరేష్కు, నాకు మధ్య మంధాన్ని ఆయన కుటుంబం అంగీకరించింది. మా విషయంలో కొన్ని సంఘటనలు జరిగాయి. కొందమంది నా క్యారెక్టర్ను దెబ్బ తీసి నా మీద, కెరీర్ మీద చెడు ప్రభావం చూపించాలని ప్రయత్నించారు. నాకు ఒక దశలో ఆత్మహత్య ఆలోచనలు కలిగాయి. కానీ ఆ దశ నుంచి బయటికి వచ్చానంటే నరేష్ నా కోసం బలంగా నిలవబట్టే. నన్ను ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక మహిళగా అంతకంటే నాకు ఏం కావాలి? నరేష్ను, మా అమ్మనీ చూసుకుంటూ ఇకపైనా సినిమాల్లో కొనసాగుతా’’ అని పవిత్ర చెప్పింది.
This post was last modified on May 25, 2023 6:46 am
సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. ఈ రెండు పేర్లు చూసి ఇండస్ట్రీలో వాళ్లే అప్పుడప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మొన్న…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…