వ్యసనం ఏదైనా ఒక్కసారి అలవాటు పడ్డాక దాన్నుంచి బయటపడలేని బలహీనత అందరికీ ఉండేదే. దానికి సూపర్ స్టార్లు సైతం మినహాయింపు కాదు. శరత్ బాబు కాలం చేశాక ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్న రజని విపరీతమైన ధూమపానం గురించిన సంఘటన ఒకటి వివరించారు. ఓసారి షూటింగ్ లో ఇద్దరూ కలిసి ఒక సీన్ చేస్తున్నారు. రజనీకాంత్ చెబుతున్న డైలాగ్ ఎంతకీ ఓకే కావడం లేదు. అప్పటికీ 15 టేకుల దాకా తీసుకున్నారు. సాధారణంగా అంత స్టేచర్ ఉన్న హీరో ఇన్నేసి అడగడం అరుదు. అలా జరగడానికి కారణం శరత్ బాబు.
తన స్నేహితుడిగా మాట ఇచ్చిన కారణంగా శరత్ బాబు ముందు సిగరెట్లు కాల్చేవారు కాదు రజని. దాని వల్లే స్పాట్ లో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించిన శరత్ స్వయంగా ఒకటి తెప్పించి మరీ కాల్చమని చెప్పారట. ఆ తర్వాతే షాట్ ఓకే అయ్యింది. దీన్ని బట్టే ఇద్దరి మధ్య పరస్పరం ఎంత స్నేహం గౌరవం ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ బాండింగ్ గొప్పగా పండిన సినిమాల్లో మొదటిది అన్నామలై. తెలుగులో బిర్లా రాముడిగా డబ్బింగ్ చేశారు. తమిళంలో భారీ బ్లాక్ బస్టర్. టాలీవుడ్ రీమేక్ లో వెంకటేష్ సుమన్ లు ఈ పాత్రలు చేశారు కానీ ఒరిజినలే బాగుంటుంది.
ఆ తర్వాత ఒకే అమ్మాయిని ప్రేమించిన జమిందార్, నౌకర్లుగా రజని శరత్ బాబుల ఫ్రెండ్ షిప్ ముత్తులో గొప్పగా పండింది. ఇలా ఒకటి రెండు కాదు శరత్ బాబుకు మన స్టార్ల దగ్గర కూడా ఎన్నో గొప్ప అనుభూతులున్నాయి. ఇటీవలే ఆసుపత్రిలో చేరినప్పుడు ఈయన పరిస్థితి చూసి చిరంజీవి కళ్లనీళ్లు పెట్టుకున్నారని సుహాసిని స్వయంగా చెప్పారు. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియనివి. నరేష్ పవిత్ర లోకేష్ ల మళ్ళీ పెళ్లిలో సూపర్ స్టార్ కృష్ణగా శరత్ బాబు చివరి పాత్ర వేయడం విధి లిఖితం. ఇందులో ఆయనకు భార్యగా గతంలో ఎన్నోసార్లు జంటగా నటించిన జయసుధ నటించడం కాకతాళీయం.
This post was last modified on May 24, 2023 11:27 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…