Movie News

టికెట్ రేట్ల పై ఫేమస్ తెలివైన ఎత్తుగడ

చిన్న సినిమాలు థియేటర్లకు జనాన్ని రప్పించాలంటే ఆషామాషీ కాదు. ఎన్ని ప్రమోషన్లు చేసినా ఉదయం ఆటకు కొంత మేరకు రాబట్టగలరు కానీ ఫస్ట్ డే నాలుగు షోలకు పబ్లిక్ నిండాలంటే ఏదోకటి అనూహ్యంగా ఉండాలి. 26న రిలీజ్ కాబోతున్న మేం ఫేమస్ టీమ్ అదే చేయబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో టికెట్ ధర కేవలం 99 రూపాయలే ఉంచబోతున్నారు. ఇది పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏపీ తెలంగాణలో సగటు రేట్ 110తో మొదలుకుని 295 దాకా ఉంది. అలాంటప్పుడు ఇంత భారీ డిస్కౌంట్ అంటే మెచ్చుకోదగిన విషయమే

కేవలం ఒక్క రోజుకే పరిమితం చేయడం వెనుక స్ట్రాటజీ ఉంది. తక్కువ రేట్ ఉందని ఎలాగూ అధిక శాతం యూత్ సినిమాని చూసేస్తారు. వాళ్ళ నుంచి టాక్ కనక పాజిటివ్ గా సోషల్ మీడియాలో, బయట ఇతర వర్గాల్లో వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా పికప్ పెరుగుతుంది. జాతిరత్నాలు, బలగం లాంటి వాటికి జరిగింది ఇదే. అయితే మేం ఫేమస్ లో ఎలాంటి ప్రత్యేక ఆకర్షణలు లేవు. అందరూ కొత్తవాళ్లే. హీరో కం దర్శకుడు సుమంత్ ప్రభాస్ కి ఇదే డెబ్యూ. అలాంటప్పుడు సమ్ థింగ్ స్పెషల్ అనిపించేది చేయాలి. అందుకే ఈ తొంభై తొమ్మిది రూపాయల రూటు పట్టేశారు

గతంలో ఇదే బ్యానర్ లో వచ్చిన రైటర్ పద్మభూషణ్ కు ఒక రోజు మహిళలకు ఉచిత ప్రదర్శనలు చేసి సక్సెస్ అయిన టీమ్ అంతకు ముందు మేజర్ కి ప్రీ రిలీజ్ ప్రీమియర్లు వేయించి గొప్ప ఫలితం అందుకుంది. మరి మేం ఫేమస్ కి ఇలా షోలు వేస్తారో లేదో తెలియదు కానీ మొత్తానికి అటెన్షన్ రాబట్టుకోవడానికి వేసిన ప్రతి ఎత్తుగడ క్రియేటివ్ గా ఉంది. మళ్ళీ పెళ్లి, 2018తో పోటీ పడబోతున్న ఈ కూల్ ఎంటర్ టైనర్ మీద ప్రస్తుతానికి భారీ అంచనాలు లేవు కానీ కంటెంట్ ని నమ్ముకున్నప్పుడు ఓపెనింగ్స్ ని వాడుకుంటే చాలు సినిమా నిలబడిపోతుంది. చూడాలి మరి ఏం చేస్తుందో

This post was last modified on May 23, 2023 4:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

2 hours ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

3 hours ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

5 hours ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

6 hours ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

6 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

7 hours ago