కంటెంట్ ఏ మాత్రం కొంచెం నచ్చినా చాలు దానికి వసూళ్లు కురిపించేయడం తెలుగు ప్రేక్షకుల సహృదయతకు నిదర్శనం. ఇది ఎన్నోసార్లు ఋజువయ్యింది. బిచ్చగాడు 2 రూపంలో ఇప్పుడు మరో సాక్ష్యం దొరికింది. మూడు రోజుల వీకెండ్ ని బ్రహ్మాండంగా వాడేసుకున్న విజయ్ ఆంటోనీ కేవలం మూడు రోజులకే తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల గ్రాస్ ని దాటేయడం రికార్డే . షేర్ రూపంలో ఆరు కోట్ల దగ్గరగా వెళ్లిపోయింది. ఇంకో ఎనభై తొంబై లక్షలు వస్తే కంప్లీట్ గా బ్రేక ఈవెన్ అయిపోయినట్టే. నిన్న ఆదివారం చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడటం దానికి నిదర్శనం
ఒక్క నైజామ్ నుంచే రెండు కోట్లకు పైగా వసూలు చేయడం చిన్న విషయం కాదు. అలా అని బిచ్చగాడు 2కి భీభత్సమైన పబ్లిక్ రెస్పాన్స్ రాలేదు. ఉన్నవాటిలో బెటర్ ఆప్షన్ ఇదొక్కటే కావడంతో మాస్ అంతా దీనికే వెళ్తున్నారు. అన్నీ మంచి శకునములే కొన్ని మెయిన్ సెంటర్స్ మినహాయించి బాగా స్లో అయిపోయింది. సీతారామం బ్లాక్ బస్టర్ తర్వాత స్వప్న సినిమాకు ఊహించని ఫలితమిది. అంతకు ముందు వారం వచ్చిన కస్టడీ లాంటివి డెడ్ స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోవడం బిచ్చగాడు 2కి వరంగా మారింది. దాంతో టాక్ తో సంబంధం లేకుండా ఆదరణ పొందింది
విచిత్రంగా ఒరిజినల్ తమిళ వెర్షన్ కి ఇంత రెస్పాన్స్ లేదు. అక్కడి ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకోలేదని ట్రేడ్ రిపోర్ట్. కాకపోతే ఇక్కడ మల్లే అక్కడ కూడా అపోజిషన్ లేకపోవడంతో డీసెంట్ ఫిగర్స్ నమోదయ్యాయి. దెబ్బకు విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 3కి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 2025లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందని త్వరలోనే వివరాలు ప్రకటిస్తానని ప్రమోషన్లలో చెప్పాడు. మణిరత్నం మల్టీస్టారర్ పొన్నియిన్ సెల్వన్ 2 వల్లే కానిది తెలుగులో విజయ్ ఆంటోనీ సాధించడం విశేషం. ఇవాళ్టి నుంచి డ్రాప్ ఎంత శాతం ఉంటుందనేది కీలకం కానుంది
This post was last modified on May 24, 2023 10:21 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…