ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస హిట్లతో వైభవం అనుభవించి ఇప్పుడు డౌన్ ఫాల్ చూస్తున్న దర్శకుల్లో తేజ ఒకరు. ముక్కుసూటి మాటలతో ఆకట్టుకునే తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్లాప్స్ కి కారణం చెప్పారు.
తను ఎమోషనల్ పర్సన్ అని చెప్తూ , కొంచెం హర్ట్ అయ్యాను , ఫీలయ్యాను అంటే సినిమా మీద ఫోకస్ పెట్టలేను. సినిమా మధ్యలో డిస్ కనెక్ట్ అయిపోయి వారికి ఏం కావాలో అదే తీసి ఇచ్చేస్తా అంటూ దర్శకుడు తేజ చెప్పుకున్నాడు. అలా ఒకసారి తను డిస్కనెక్ట్ అయితే ఇంక అనుకున్నది తీయలేనని సినిమాను వదిలేయడమే అంటూ తేజ తెలిపాడు.
ఇక రాజమౌళి గొప్పదనం గురించి ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయితే తేజ మాత్రం ఇండియన్ రుపీ వెల్యూ రాజమౌళి వల్ల పెరగనుందని అన్నాడు. అమెరికన్ సినిమాలు చూసి ఆ దేశానికి డాలర్ రేటు పెరిగిందని , అలాగే రాజమౌళి హై స్టాండర్డ్స్ తో తీసే తెలుగు సినిమాల వల్ల త్వరలోనే ఇండియన్ రుపీ వెల్యూ పెరుగుతుందని అన్నాడు.
ప్రస్తుతం అభిరామ్ దగ్గుబాటి హీరోగా తేజ తీసిన అహింస రిలీజ్ కి రెడీ అయింది. పలు సార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీత వంటి డిజాస్టర్ తర్వాత తేజ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. మరి తన మాటలతో అదరగొట్టి క్లాప్స్ కొట్టించే తేజ దర్శకుడిగా ఈసారి ఎలాంటి హిట్ కొడతాడో వేచి చూడాలి.
This post was last modified on May 23, 2023 8:56 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…