ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస హిట్లతో వైభవం అనుభవించి ఇప్పుడు డౌన్ ఫాల్ చూస్తున్న దర్శకుల్లో తేజ ఒకరు. ముక్కుసూటి మాటలతో ఆకట్టుకునే తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్లాప్స్ కి కారణం చెప్పారు.
తను ఎమోషనల్ పర్సన్ అని చెప్తూ , కొంచెం హర్ట్ అయ్యాను , ఫీలయ్యాను అంటే సినిమా మీద ఫోకస్ పెట్టలేను. సినిమా మధ్యలో డిస్ కనెక్ట్ అయిపోయి వారికి ఏం కావాలో అదే తీసి ఇచ్చేస్తా అంటూ దర్శకుడు తేజ చెప్పుకున్నాడు. అలా ఒకసారి తను డిస్కనెక్ట్ అయితే ఇంక అనుకున్నది తీయలేనని సినిమాను వదిలేయడమే అంటూ తేజ తెలిపాడు.
ఇక రాజమౌళి గొప్పదనం గురించి ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయితే తేజ మాత్రం ఇండియన్ రుపీ వెల్యూ రాజమౌళి వల్ల పెరగనుందని అన్నాడు. అమెరికన్ సినిమాలు చూసి ఆ దేశానికి డాలర్ రేటు పెరిగిందని , అలాగే రాజమౌళి హై స్టాండర్డ్స్ తో తీసే తెలుగు సినిమాల వల్ల త్వరలోనే ఇండియన్ రుపీ వెల్యూ పెరుగుతుందని అన్నాడు.
ప్రస్తుతం అభిరామ్ దగ్గుబాటి హీరోగా తేజ తీసిన అహింస రిలీజ్ కి రెడీ అయింది. పలు సార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీత వంటి డిజాస్టర్ తర్వాత తేజ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. మరి తన మాటలతో అదరగొట్టి క్లాప్స్ కొట్టించే తేజ దర్శకుడిగా ఈసారి ఎలాంటి హిట్ కొడతాడో వేచి చూడాలి.
This post was last modified on May 23, 2023 8:56 pm
ఈ మధ్య కొన్ని తెలుగు పాటల్లో డ్యాన్స్ మూమెంట్స్ మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ కొరియోగ్రాఫర్…
రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది మీద ఆయన అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. గతంలో ఎన్నడూ లేనంత వాడీవేడీగా సాగిన ఈ సమావేశాల్లో చాలా అంశాలపై…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించారు. నగరంలోని ఐఐటీ మద్రాస్ లో…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు శుక్రవారం డబుల్ షాక్ తగిలింది. దళిత యువకుడు…
ఆసియాలో ప్రముఖ పర్యాటక దేశంగా పేరుగాంచిన థాయ్ ల్యాండ్ తో పాటు నిత్యం అంతర్యుద్ధంతో సతమతం అవుతున్న మయన్మార్ లను…