ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస హిట్లతో వైభవం అనుభవించి ఇప్పుడు డౌన్ ఫాల్ చూస్తున్న దర్శకుల్లో తేజ ఒకరు. ముక్కుసూటి మాటలతో ఆకట్టుకునే తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్లాప్స్ కి కారణం చెప్పారు.
తను ఎమోషనల్ పర్సన్ అని చెప్తూ , కొంచెం హర్ట్ అయ్యాను , ఫీలయ్యాను అంటే సినిమా మీద ఫోకస్ పెట్టలేను. సినిమా మధ్యలో డిస్ కనెక్ట్ అయిపోయి వారికి ఏం కావాలో అదే తీసి ఇచ్చేస్తా అంటూ దర్శకుడు తేజ చెప్పుకున్నాడు. అలా ఒకసారి తను డిస్కనెక్ట్ అయితే ఇంక అనుకున్నది తీయలేనని సినిమాను వదిలేయడమే అంటూ తేజ తెలిపాడు.
ఇక రాజమౌళి గొప్పదనం గురించి ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయితే తేజ మాత్రం ఇండియన్ రుపీ వెల్యూ రాజమౌళి వల్ల పెరగనుందని అన్నాడు. అమెరికన్ సినిమాలు చూసి ఆ దేశానికి డాలర్ రేటు పెరిగిందని , అలాగే రాజమౌళి హై స్టాండర్డ్స్ తో తీసే తెలుగు సినిమాల వల్ల త్వరలోనే ఇండియన్ రుపీ వెల్యూ పెరుగుతుందని అన్నాడు.
ప్రస్తుతం అభిరామ్ దగ్గుబాటి హీరోగా తేజ తీసిన అహింస రిలీజ్ కి రెడీ అయింది. పలు సార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీత వంటి డిజాస్టర్ తర్వాత తేజ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. మరి తన మాటలతో అదరగొట్టి క్లాప్స్ కొట్టించే తేజ దర్శకుడిగా ఈసారి ఎలాంటి హిట్ కొడతాడో వేచి చూడాలి.
This post was last modified on May 23, 2023 8:56 pm
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…