ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస హిట్లతో వైభవం అనుభవించి ఇప్పుడు డౌన్ ఫాల్ చూస్తున్న దర్శకుల్లో తేజ ఒకరు. ముక్కుసూటి మాటలతో ఆకట్టుకునే తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్లాప్స్ కి కారణం చెప్పారు.
తను ఎమోషనల్ పర్సన్ అని చెప్తూ , కొంచెం హర్ట్ అయ్యాను , ఫీలయ్యాను అంటే సినిమా మీద ఫోకస్ పెట్టలేను. సినిమా మధ్యలో డిస్ కనెక్ట్ అయిపోయి వారికి ఏం కావాలో అదే తీసి ఇచ్చేస్తా అంటూ దర్శకుడు తేజ చెప్పుకున్నాడు. అలా ఒకసారి తను డిస్కనెక్ట్ అయితే ఇంక అనుకున్నది తీయలేనని సినిమాను వదిలేయడమే అంటూ తేజ తెలిపాడు.
ఇక రాజమౌళి గొప్పదనం గురించి ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయితే తేజ మాత్రం ఇండియన్ రుపీ వెల్యూ రాజమౌళి వల్ల పెరగనుందని అన్నాడు. అమెరికన్ సినిమాలు చూసి ఆ దేశానికి డాలర్ రేటు పెరిగిందని , అలాగే రాజమౌళి హై స్టాండర్డ్స్ తో తీసే తెలుగు సినిమాల వల్ల త్వరలోనే ఇండియన్ రుపీ వెల్యూ పెరుగుతుందని అన్నాడు.
ప్రస్తుతం అభిరామ్ దగ్గుబాటి హీరోగా తేజ తీసిన అహింస రిలీజ్ కి రెడీ అయింది. పలు సార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీత వంటి డిజాస్టర్ తర్వాత తేజ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. మరి తన మాటలతో అదరగొట్టి క్లాప్స్ కొట్టించే తేజ దర్శకుడిగా ఈసారి ఎలాంటి హిట్ కొడతాడో వేచి చూడాలి.
వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…
సమంత మా ఇంటి బంగారం బాగానే బోణీ కొట్టేలా ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే లక్షా పాతిక వేల డాలర్లు…
వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…