టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఆస్తి పాస్తుల గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. 70వ దశకం నుంచి సినిమాల్లో చాలా బిజీగా ఉన్న నరేష్ సొంతంగానే పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించగా.. తల్లి విజయ నిర్మల నుంచి వచ్చిన ఆస్తులు కూడా కలిపితే అది వెయ్యి కోట్లకు తక్కువ ఉండదు అని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. ఐతే నరేష్ ఇప్పటిదాకా మీడియా ముందు కానీ.. ఇంటర్వ్యూల్లో కానీ తన ఆస్తుల గురించి పెద్దగా మాట్లాడింది లేదు.
కానీ తనే లీడ్ రోల్ చేసిన కొత్త చిత్రం ‘మళ్ళీ పెళ్ళి’ని గట్టిగా ప్రమోట్ చేస్తున్న నరేష్.. ఇందులో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక విషయాల గురించి ఓపెన్ అయ్యాడు. తన ఆస్తి వెయ్యి కోట్లు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చన్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఇవి ఊహాగానాలు కాదని.. నిజమే అని క్లారిటీ ఇవ్వడం విశేషం.
“నేను రిచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును.. నేను బిలియనీర్ని అని ఒప్పుకుంటా. మా అమ్మగారి నుంచి నాకు ఆస్తులు వచ్చాయి. నేను కూడా కష్టపడి చాలానే సంపాదించా. మేం భూముల మీద పెట్టుబడులు పెట్టాం. వాటి ధరలు బాగా పెరిగాయి. మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఐతే ఎంత డబ్బు ఉంది అన్నదాన్ని బట్టి మనం ఎంత ధనవంతులం అనేది ఆధారపడి ఉండదు. ఎంత సంతోషంగా ఉన్నాం అన్నదే ముఖ్యం. రోజూ ఎంత ఆనందంగా గడుపుతాం. ఉన్న డబ్బును ఎలా ఖర్చు పెడతాం అన్నది చూడాలి. మేం మా కోసమే కాక అవసరంలో ఉన్న వారి కోసం కూడా డబ్బులు ఖర్చు పెడతాం. మాకు వీలైనంత మేర పది మందికి సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నేను చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నా. ఆస్వాదిస్తున్నా. అది అన్నింటికంటే ముఖ్యమైన విషయం” అని నరేష్ తెలిపాడు.
This post was last modified on May 22, 2023 6:34 pm
వైసీపీ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలను మంత్రులు అస్సలు ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎక్కడా వెనుకాడవద్దని ఆయన…
అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, అమరావతి నిర్మాణం గురించి వచ్చిన కథనం…
జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు వీఐపీ ఖైదీలు అక్కడ కూడా రాజభోగాలు అనుభవిస్తున్న ఘటనలు అనేకం చూశాం. జైలులోనే ఫైవ్…
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…