టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఆస్తి పాస్తుల గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. 70వ దశకం నుంచి సినిమాల్లో చాలా బిజీగా ఉన్న నరేష్ సొంతంగానే పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించగా.. తల్లి విజయ నిర్మల నుంచి వచ్చిన ఆస్తులు కూడా కలిపితే అది వెయ్యి కోట్లకు తక్కువ ఉండదు అని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. ఐతే నరేష్ ఇప్పటిదాకా మీడియా ముందు కానీ.. ఇంటర్వ్యూల్లో కానీ తన ఆస్తుల గురించి పెద్దగా మాట్లాడింది లేదు.
కానీ తనే లీడ్ రోల్ చేసిన కొత్త చిత్రం ‘మళ్ళీ పెళ్ళి’ని గట్టిగా ప్రమోట్ చేస్తున్న నరేష్.. ఇందులో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక విషయాల గురించి ఓపెన్ అయ్యాడు. తన ఆస్తి వెయ్యి కోట్లు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చన్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఇవి ఊహాగానాలు కాదని.. నిజమే అని క్లారిటీ ఇవ్వడం విశేషం.
“నేను రిచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును.. నేను బిలియనీర్ని అని ఒప్పుకుంటా. మా అమ్మగారి నుంచి నాకు ఆస్తులు వచ్చాయి. నేను కూడా కష్టపడి చాలానే సంపాదించా. మేం భూముల మీద పెట్టుబడులు పెట్టాం. వాటి ధరలు బాగా పెరిగాయి. మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఐతే ఎంత డబ్బు ఉంది అన్నదాన్ని బట్టి మనం ఎంత ధనవంతులం అనేది ఆధారపడి ఉండదు. ఎంత సంతోషంగా ఉన్నాం అన్నదే ముఖ్యం. రోజూ ఎంత ఆనందంగా గడుపుతాం. ఉన్న డబ్బును ఎలా ఖర్చు పెడతాం అన్నది చూడాలి. మేం మా కోసమే కాక అవసరంలో ఉన్న వారి కోసం కూడా డబ్బులు ఖర్చు పెడతాం. మాకు వీలైనంత మేర పది మందికి సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నేను చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నా. ఆస్వాదిస్తున్నా. అది అన్నింటికంటే ముఖ్యమైన విషయం” అని నరేష్ తెలిపాడు.
సమంత మా ఇంటి బంగారం బాగానే బోణీ కొట్టేలా ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే లక్షా పాతిక వేల డాలర్లు…
వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…