ఈ రోజుల్లో చిన్న స్థాయి సినిమాల కోసం థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం చాలా చాలా కష్టం అయిపోతోంది. ప్రస్తుత బిజీ లైఫ్లో ఓటీటీలను దాటి థియేటర్ల వరకు ప్రేక్షకులను రప్పించడం అంటే అంత తేలిక కాదు. పెద్ద హీరోల సినిమాలకు ఢోకా లేదు కానీ.. చిన్న, మీడియం రేంజ్ సినిమాల పరిస్థితే రోజు రోజుకూ కష్టం అవుతోంది. వెరైటీ ప్రమోషన్లు, ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ఆకట్టుకుంటే తప్ప ప్రేక్షకులు థియేటర్ల వైపు కదలట్లేదు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల విషయంలో కొందరు కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు.
ఐతే ‘రెజీనా’ అనే ఓ తమిళ సినిమా పట్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడానికి ఆ చిత్ర బృందం చేసిన ఒక ప్రయత్నం విమర్శల పాలైంది. ఈ సినిమాలో సునైనా లీడ్ రోల్ చేస్తోంది. డొమిన్ డిసిల్వా అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ థ్రిల్లర్ సినిమా మేకింగ్ దశలో ఉండగానే చిత్ర బృందం ఒక డ్రామాను నడిపించింది.
సునైనా కిడ్నాప్ అయినట్లుగా ఒక వార్తను లీక్ చేశారు. ఈ విషయంలో తెలిసి సన్నిహితులు, అభిమానులు.. సునైనాకు ఫోన్లు చేయగా.. ఆమె నంబర్ రెండు రోజుల పాటు స్విచాఫ్ అయి ఉంది. దీంతో హీరోయిన్ సునైనా కిడ్నాప్ అంటూ కోలీవుడ్లో వార్త దావానలంలా వ్యాపించింది. చివరికి చూస్తే ఇదంతా సినిమా ప్రమోషన్లలో భాగమని తేలింది. తాను సేఫ్గానే ఉన్నానని.. ఇదంతా తన పాత్ర తాలూకు ఇంటెన్సిటీని చూపించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం అని.. ఏదో కవరప్ చేయడానికి ప్రయత్నించింది. దీంతో చిత్ర బృందం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి.
ప్రమోషన్ల కోసం మరీ ఇంత డ్రామా నడిపించాలా.. అభిమానుల మనోభావాలతో ఆడుకోవాలా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఐతే విమర్శల మాటెలా ఉన్నా.. లేడీ ఓరియెంటెడ్ మూవీ అయిన ‘రెజీనా’ గురించి మీడియాలో, సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగిందిన చిత్ర బృందం హ్యాపీగానే ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on May 22, 2023 7:03 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…