Movie News

హీరోయిన్ కిడ్నాప్.. మొత్తం బుస్


ఈ రోజుల్లో చిన్న స్థాయి సినిమాల కోసం థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం చాలా చాలా కష్టం అయిపోతోంది. ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఓటీటీలను దాటి థియేటర్ల వరకు ప్రేక్షకులను రప్పించడం అంటే అంత తేలిక కాదు. పెద్ద హీరోల సినిమాలకు ఢోకా లేదు కానీ.. చిన్న, మీడియం రేంజ్ సినిమాల పరిస్థితే రోజు రోజుకూ కష్టం అవుతోంది. వెరైటీ ప్రమోషన్లు, ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ఆకట్టుకుంటే తప్ప ప్రేక్షకులు థియేటర్ల వైపు కదలట్లేదు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల విషయంలో కొందరు కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు.

ఐతే ‘రెజీనా’ అనే ఓ తమిళ సినిమా పట్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడానికి ఆ చిత్ర బృందం చేసిన ఒక ప్రయత్నం విమర్శల పాలైంది. ఈ సినిమాలో సునైనా లీడ్ రోల్ చేస్తోంది. డొమిన్ డిసిల్వా అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ థ్రిల్లర్ సినిమా మేకింగ్ దశలో ఉండగానే చిత్ర బృందం ఒక డ్రామాను నడిపించింది.

సునైనా కిడ్నాప్ అయినట్లుగా ఒక వార్తను లీక్ చేశారు. ఈ విషయంలో తెలిసి సన్నిహితులు, అభిమానులు.. సునైనాకు ఫోన్లు చేయగా.. ఆమె నంబర్ రెండు రోజుల పాటు స్విచాఫ్ అయి ఉంది. దీంతో హీరోయిన్ సునైనా కిడ్నాప్ అంటూ కోలీవుడ్లో వార్త దావానలంలా వ్యాపించింది. చివరికి చూస్తే ఇదంతా సినిమా ప్రమోషన్లలో భాగమని తేలింది. తాను సేఫ్‌గానే ఉన్నానని.. ఇదంతా తన పాత్ర తాలూకు ఇంటెన్సిటీని చూపించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం అని.. ఏదో కవరప్ చేయడానికి ప్రయత్నించింది. దీంతో చిత్ర బృందం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి.

ప్రమోషన్ల కోసం మరీ ఇంత డ్రామా నడిపించాలా.. అభిమానుల మనోభావాలతో ఆడుకోవాలా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఐతే విమర్శల మాటెలా ఉన్నా.. లేడీ ఓరియెంటెడ్ మూవీ అయిన ‘రెజీనా’ గురించి మీడియాలో, సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగిందిన చిత్ర బృందం హ్యాపీగానే ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on May 22, 2023 7:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

2 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

2 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

13 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

13 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

14 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

15 hours ago