ఒకప్పుడు చాలా బిజీగా ఉంటూ వరుసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చిన మంచు మనోజ్.. ఐదేళ్ల పాటు సినిమా లేకుండా ఖాళీగా ఉండిపోతాడని ఎవ్వరూ ఊహించలేదు. 2017 చివర్లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’నే మనోజ ్ చివరి సినిమా. ఆ తర్వాత మూడేళ్ల పాటు సినిమా ఊసే ఎత్తని అతను.. మధ్యలో ‘అహం బ్రహ్మాస్మి’ పేరుతో సినిమాను అనౌన్స్ చేసి.. తర్వాత దాన్ని కూడా అటకెక్కించేసిన సంగతి తెలిసిందే.
ఐతే కొన్ని నెలల కిందట మనోజ్ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. అదే.. వాట్ ద ఫిష్. ‘నేను మీకు తెలుసా’ సినిమాను గుర్తు చేస్తూ క్రేజీగా కనిపించింది ఈ సినిమా టైటిల్, ప్రి లుక్ పోస్టర్. ఈ రోజు మనోజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘వాట్ ద ఫిష్’కు సంబంధించి చిన్న టీజర్ లాంటి వీడియో ఒకటి వదిలారు.
అది క్రేజీ క్రేజీగా సాగిపోతూ.. మనోజ్ అభిమానులనే కాక విభిన్నమైన సినిమాలను ఇష్టపడే వారిని ఆకట్టుకుంది. సినిమా యనీక్గా, క్రేజీగా ఉండబోతోందని.. మనోజ్ ఈ సినిమాలో రకరకాల అవతారాల్లో కనిపించబోతున్నాడని సంకేతాలు ఇచ్చింది. ఈ చిత్రాన్ని వి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. పుట్టిన రోజు సందర్భంగా మనోజ్ నటించబోయే మరో కొత్త చిత్రాన్ని కూడా ప్రకటించడం విశేషం. భాస్కర్ బంటుపల్లి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బేనర్ ప్రొడక్షన్ నంబర్ 3. శ్రీనివాసులు, వేణుగోపాల్, మమత, ముళ్ళపూడి రాజేశ్వరి ఉమ్మడిగా నిర్మించే ఈ చిత్రానికి పెద్ద బడ్జెట్టే పెడుతున్నారట. ఇది కూడా ఒక వైవిధ్యమైన కథాంశంతోనే తెరకెక్కనుందట. కొన్నేళ్ల పాటు సినిమానే లేకుండా ఉండిపోయిన మనోజ్.. ఈ పుట్టిన రోజుకు రెండు కొత్త సినిమాల విశేషాలతో అభిమానులకు డబుల్ ధమాకా ట్రీట్ ఇవ్వడం విశేషమే.
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…