విభిన్నమైన చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘మెంటల్ మదిలో’, ‘నీది నాది ఒకే కథ’ వంటి రొటీన్కు భిన్నంగా సాగిన సినిమాలు శ్రీవిష్ణుకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. సక్సెస్లు వచ్చినా స్టార్ డమ్ ముసుగులో మునిగిపోకుండా, కేవలం కథాబలం ఉన్న కాన్సెప్ట్లనే ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో హిట్టు కొట్టిన శ్రీవిష్ణు, వచ్చే ఏడాది చివరిదాకా ఫుల్లు బిజీగా ఉండబోతున్నాడట.
సినిమాల్లో నటించాలనే కసి, కోరిక కారణంగానే హీరో కావడానికి ముందు 12 ఏళ్లు జూనియర్ ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కష్టపడ్డానని చెప్పిన శ్రీవిష్ణు… తన సుదీర్ఘ కెరీర్ సంతృప్తికరంగానే సాగుతోందని అన్నాడు. ప్రస్తుతం ‘రాజ రాజ చోళ’ అనే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు శ్రీవిష్ణు.
ఒక్క వ్యక్తి ద్వారా మొదలైన పుకార్లు, సమాజంలోని మనుషుల బుర్రలను ఎలా తొణిచేస్తాయనే డిఫరెంట్ కథాంశంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో పాటు మరో మూడు ప్రాజెక్ట్లను ఫైనల్ చేసిన శ్రీవిష్ణు… లాక్డౌన్ ముగిసిన తర్వాత వాటిని కూడా ప్రారంభించబోతున్నాడట. ఇప్పుడున్న ఖాళీ టైమ్ను ఏ మాత్రం వేస్ట్ చేయకుండా తన దగ్గరున్న యంగ్ దర్శకుల స్క్రిప్ట్స్ అన్నీ చదివేస్తున్న ఈ కుర్రాడు… వాటిల్లో నచ్చిన కథలను ఎంచుకుని, లైన్గా సినిమాలు చేస్తూ పోతాడట.
స్టార్ హీరోలు ఒక్క సినిమా ఒకే చేయడానికి మూడేసి నెలల సమయం తీసుకుంటుంటే… మూడు నెలల్లో కనీసం ఓ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాడు శ్రీవిష్ణు. ఈ ఏడాది ఇప్పటికే సగం పూర్తయింది కాబట్టే వచ్చే ఏడాది పూర్తిగా స్క్రీన్ మీద తానే కనిపిస్తామని ఎంతో ధీమాగా చెబుతున్నాడు శ్రీవిష్ణు. కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీవిష్ణు స్నేహితుడు నారా రోహిత్ కూడా త్వరలో మళ్లీ ట్రాక్ ఎక్కబోతున్నాడట. ఇద్దరూ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్లో నటించబోతున్నట్టు ప్రకటించాడు శ్రీవిష్ణు.
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…