కొన్నిసార్లు ఇండస్ట్రీలో నెగ్గాలంటే కేవలం సపోర్ట్, ఆఫర్లు ఉంటే సరిపోదు. టాలెంట్ తో పాటు సరైన కథలు డైరెక్టర్ల కాంబినేషన్లు పడాలి. లేదంటే ఎక్కువ కాలం కొనసాగడం కష్టం. సంతోష్ శోభన్ పరిస్థితి అలాగే ఉంది. స్వప్న సినిమా లాంటి పెద్ద బ్యానర్ లో అన్నీ మంచి శకునములే చేశాడు. పబ్లిక్ టాక్, రివ్యూలు డివైడ్ గా వచ్చాయి. ఈ ఆదివారం దాటితే కష్టమేనని ట్రేడ్ టాక్. అటువైపు నిర్మాతలు ప్రమోషన్ స్పీడ్ తగ్గించేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి సమ్మర్ లో మంచి ఛాయస్ గా నిలిచే అవకాశాన్ని దర్శకురాలు నందినిరెడ్డి వాడుకోలేదని మూవీ లవర్స్ అభిప్రాయ పడుతున్నారు
ఇదే కాదు సంతోష్ శోభన్ గత మూడు సినిమాలు దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. శ్రీదేవి శోభన్ బాబు కనీసం పబ్లిసిటీ వెనక్కు తేలేకపోగా కళ్యాణం కమనీయం యావరేజ్ కంటెంట్ తో పాటు సంక్రాంతి రేసులో నలిగిపోయింది. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరీ అన్యాయం. మారుతీతో జట్టు కట్టిన మంచి రోజులు వచ్చాయి కూడా సోసో ఫలితమే. ఇవన్నీ థియేట్రికల్ ఫెయిల్యూర్స్. యూవి క్రియేషన్స్, సుస్మిత కొణిదెల, వైజయంతి మూవీస్, సంపత్ నంది, ఎస్కెఎన్ లాంటి పెద్ద చేతులే అండగా ఉన్నా లాభం లేకుండా పోతోంది. రిలీజ్ వరకే ఈ అంశాలు ఉపయోగపడుతున్నాయి
పోనీ కుర్రాడిలో విషయం లేదా అంటే లుక్స్, యాక్టింగ్ రెండింటి మీదా ఎప్పుడు విమర్శలు రాలేదు. చలాకీగా ఉంటాడు. చక్కగా చేస్తాడు. అన్నీ ఉన్నా అంగట్లో శనీశ్వరుడి సామెత లాగా ఇన్నేసి దెబ్బలు తట్టుకోవడం సులభం కాదు. మొన్నో ఇంటర్వ్యూలో సిద్దు జొన్నలగడ్డ సరదాగా సంతోష్ శోభన్ ని ఓ ప్రశ్న అడిగాడు. అసలు ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నావని. అంటే వరసబెట్టి రావడమే కానీ హిట్టు కొట్టింది లేదని తన అభిప్రాయం. ఇప్పుడదే మళ్ళీ నిజమయ్యింది. ప్రేమ్ కుమార్ నిర్మాణంలో ఉంది. కనీసం అదైనా ఈ పరంపరకు బ్రేక్ వేస్తుందేమో చూడాలి
This post was last modified on May 20, 2023 4:47 pm
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…