భారీ ఎత్తున ప్రమోషన్లు చేయకపోయినా బిచ్చగాడు 2 ఓపెనింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో బాగా నమోదయ్యాయి. ప్రధాన కేంద్రాల్లో ఉదయం షోలు హౌస్ ఫుల్ పడటం అనూహ్యం. టాక్ ఎంత డివైడ్ గా ఉన్నా ఫస్ట్ పార్ట్ తాలూకు ప్రభావం ఆడియన్స్ మనసులో బలంగా ఉండటంతో ఇది కూడా బాగానే ఉంటుందన్న నమ్మకంతో థియేటర్లకు వచ్చారు. గత కొన్నేళ్లలో విజయ్ ఆంటోనీ ఏ సినిమా కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీతో షోలు మొదలుకాలేదు. డెఫిషిట్లే ఎక్కువ. అలాంటిది బిచ్చగాడు 2 ఆ ట్రెండ్ కి భిన్నంగా కొన్ని ఏరియాలలో షాకింగ్ ఫిగర్స్ వచ్చాయి.
ట్రేడ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు మొదటి రోజు బిచ్చగాడు 2 సుమారుగా 2 కోట్ల 30 లక్షల షేర్ వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే ఇది నాలుగు కోట్ల పైమాటే. ఇది ఫస్ట్ డే పొన్నియిన్ సెల్వన్ 2 కంటే ఎక్కువ. దీన్ని బట్టే విజయ్ ఆంటోనీ మూవీ మీద జనాలకు ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క నైజాం నుంచే డెబ్భై లక్షల దాకా రావడం మాములు విషయం కాదు. ఒకపక్క అన్నీ మంచి శకునములే టాక్ దీనికి ప్లస్ గా మారుతోంది. బిచ్చగాడు 2కి యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాలేదు.రివ్యూలు సైతం మిశ్రమంగానే ఉన్నాయి.
ఇంకో నాలుగు కోట్ల షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఈ వీకెండ్ ఇంకే సినిమాలు మాస్ కి ఆప్షన్ లేవు కాబట్టి బిచ్చగాడు 2కి అది ప్లస్ కానుంది. వచ్చే వారం మళ్ళీ పెళ్లి, మేం ఫేమస్, 2018 రాబోతున్న నేపథ్యంలో ఆ లోగానే వీలైనంత రాబట్టుకోవాలి. వాటి టాక్ ఎలా ఉన్నా విజయ్ ఆంటోనీ సినిమా ఓసారి చూడొచ్చనే మాట పబ్లిక్ లో స్ప్రెడ్ అయితే లాభాలు అందుకునే ఛాన్స్ లేకపోలేదు. శాకుంతలంతో మొదలుపెట్టి కస్టడీ దాకా బాక్సాఫీస్ వద్ద ఏదీ వర్కౌట్ కాని పరిస్థితులు బిచ్చగాడు 2కి అనుకూలంగా మారాయి. లెక్కలు మాత్రం ఊహించనివే నమోదయ్యాయి.
This post was last modified on May 20, 2023 12:33 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…