ఇవాళ హైదరాబాద్ కూకట్ పల్లి మైదానంలో జరగబోయే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు టాలీవుడ్ అరుదైన కలయిక కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మెల్లగా నిరాశ కలిగించే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానమైనది జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు. ఇవాళే పుట్టినరోజు కావడంతో ఫ్యామిలీ కమిట్ మెంట్స్ ఇతర వ్యక్తిగత కారణాల రాలేకపోతున్నట్టు నిర్వాహకులకు ముందే చెప్పినప్పటికీ నగరంలో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయడంతో ఈ కన్ఫ్యూజన్ తలెత్తింది. లిస్టు చాలా పెద్దదే ఉంది కానీ ఎందరు వస్తారో చివరి నిమిషం దాకా తేలేలా లేదు.
నందమూరి అభిమానులు బాగా మిస్ అవుతున్నది మాత్రం బాబాయ్ బాలయ్య అబ్బాయ్ తారక్ ల కలయిక. ఈ ఇద్దరూ ఒకే పబ్లిక్ స్టేజి పంచుకుని ఏళ్ళు దాటిపోయింది. హరికృష్ణ గారు కాలం చేసినప్పుడు దానికి సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రమే కలిసి కనిపించారు తప్ప బయట ఆ ఛాన్స్ దొరకలేదు. ఇద్దరి మధ్య అంతగా పొసగడం లేదనే ప్రచారానికి చెక్ పెట్టే అవకాశం రావడం లేదని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో ఎన్టీఆర్ సెనెటరీ సెలబ్రేషన్స్ దానికి బ్రేక్ వేస్తుందనుకుంటే ఇలా జరిగింది. ఇప్పట్లో ఇలాంటి వేడుక మరొకటి రాకపోవచ్చు.
కళ్యాణ్ రామ్ హాజరవ్వడం దాదాపు ఖాయమే. నందమూరి నారా కుటుంబాలు ఎలాగూ వస్తాయి. తారక్ వచ్చి ఉంటే ఫోటోలు వైరలయ్యేవని సోషల్ మీడియా జనాలు కూడా ఎదురు చూశారు. దేవర షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న జూనియర్ బర్త్ డే ఫ్యామిలీతోనే జరుపుకోబోతున్నట్టు సమాచారం. మరోపక్క సింహాద్రి రీ రిలీజ్ ఓ సంబరంగా జరుగుతోంది. ఉదయం అయిదు నుంచి తెలుగు రాష్ట్రాల్లో షోలు మొదలుపెట్టగా చెన్నై రోహిణి థియేటర్లో అర్ధరాత్రి పన్నెండుకే షో వేయడం గమనార్హం. మొత్తానికి బాబాయ్ అబ్బాయ్ ల కాంబో మిస్ అయిపోయింది.
This post was last modified on May 20, 2023 11:41 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…