స్టార్ హీరోలు తమ సినిమాల సంఖ్య విషయంలో 25.. 50.. 75.. 100.. ఇలాంటి మైలురాళ్లను ప్రత్యేకంగా భావిస్తారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి ఒకప్పటి పెద్ద హీరోలు వందల సంఖ్యలో సినిమాలు లాగించేశారు కానీ.. ఇప్పటి స్టార్లు 50 సినిమాల మార్కును అందుకోవడం కూడా కష్టం అయిపోతోంది. నిన్నటితరం సూపర్ స్టార్లలో చిరంజీవి 150 మైలురాయిని అందుకుంటే.. బాలకృష్ణ 100 మార్కును దాటేశాడు. నాగార్జున 100కు చేరువగా ఉన్నాడు. వెంకటేష్ ప్రస్తుతం 75వ సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని వెంకీతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. చాలా కథలు, దర్శకులను పరిశీలించి.. చివరికి ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలనుతో ‘సైంధవ్’ను సెట్ చేసింది. ఈ కాంబినేషన్ వెంకీ అభిమానుల్లోనే కాక సామాన్య ప్రేక్షకుల్లోనూ అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు శైలేష్ ఎంచుకున్న కాస్టింగ్ కూడా ఇంట్రెస్టింగే. శ్రద్ధ శ్రీనాథ్ ఇందులో హీరోయిన్ కాగా.. బాలీవుడ్ గ్రేట్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
వెంకీ 75లో నవాజుద్దీన్ను విలన్గా ప్రకటించినపుడే అందరూ ఎగ్జైట్ అయ్యారు. ఆయన నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నవాజుద్దీన్ ప్రతిభకు తార్కాణాలుగా చూపించడానికి బాలీవుడ్లో ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ సహా ఎన్నో సినిమాలున్నాయి. అలాంటి నటుడు తెలుగులో సినిమా చేయడానికి అంగీకరించాడంటేనే క్యారెక్టర్ ఒక రేంజిలో ఉంటుందని అంచనా వేయొచ్చు.
ఐతే నవాజ్ను మాస్గా ఉండే వయొలెంట్ పాత్ర చేస్తాడని అనుకుంటే.. అతణ్ని పక్కా క్లాస్ క్యారెక్టర్లో దించాడు శైలేష్. నవాజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘సైంధవ్’ నుంచి తన ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఇందులో ‘వికాస్ మాలిక్’ అనే పాత్ర చేస్తున్నాడు నవాజ్. ఒక పోష్ కారు ముందు.. సిగరెట్ వెలిగించుకుని ట్రెండీ డ్రెస్లో కనిపించాడు నవాజ్. ఈ లుక్ చూస్తే చాలా క్లాస్గా ఉంది. మరి ఇలాంటి అవతారంలో నవాజ్ ఎలా విలనీ పండిస్తాడన్నది ఆసక్తికరం. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 20, 2023 10:07 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…