కొన్నేళ్లుగా కంగనా రనౌత్ తన సినిమాలతో కంటే కూడా వేరే విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె రాజకీయ వ్యవహారాల్లో అవసరం లేని జోక్యంతో తన కెరీర్ను చేజేతులా దెబ్బ తీసుకుందనే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారుకు మద్దతుగా మాట్లాడ్డం మొదలుపెట్టి, ఒక దశ దాటాక భజనపరురాలిలా మారిపోవడం.. బీజేపీ వైరి పక్షాల మీద శ్రుతి మించి విమర్శలు చేయడం ఆమె చాలానే చేటు చేసింది.
కంగనా మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయి.. ఆ ప్రభావం తన సినిమాల మీద గట్టిగానే పడింది. మరోవైపు కంగనా అనేక బ్రాండ్ల ప్రచారం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. ఈ నష్టం గురించి తాజాగా కంగనా స్పందించింది. తనను ఉన్నట్లుండి అనేక బ్రాండ్ల ప్రచారం నుంచి తప్పించడంతో రూ.40 కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని.. అందుకు తనకు బాధేమీ లేదని కంగనా వ్యాఖ్యానించడం విశేషం.
‘‘నిజాలు మాట్లాడినందుకు చాలా కోల్పోవాల్సి వస్తుంది’’ అంటూ ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ చేసిన ఒక ట్వీట్పై స్పందిస్తూ తాను కూడా నిజాలు మాట్లాడి చాలా నష్టపోయినట్లు వెల్లడించింది కంగనా. ‘‘ఇది నా వ్యక్తిగతం.. నా స్వేచ్ఛ.. నా విజయం. నేను హిందూయిజానికి మద్దతుగా.. రాజకీయ నాయకులకు, దేశద్రోహులకు వ్యతిరేకంగా నిజాలు మాట్లాడినందుకు చాలా నష్టపోయా.
రాత్రికి రాత్రి 20-25 సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం చేసుకున్న ఒప్పందాల నుంచి నన్ను తప్పించాయి. దీని వల్ల ఏడాదికి 30-40 కోట్ల దాకా నష్టపోయాను. అయినా నాకేమీ బ ాధ లేదు. నేనిప్పుడు స్వేచ్ఛా జీవిని. మరింత గట్టిగా నా గళం వినిపిస్తా’’ అని కంగనా పేర్కొంది. గత ఏడాది కంగనా నటించిన ధకడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోరాతి ఘోరమైన ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుం ఆమె ఎమర్జెన్సీతో పాటు చంద్రముఖి-2 సినిమాల్లో నటిస్తోంది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…