కొన్నేళ్లుగా కంగనా రనౌత్ తన సినిమాలతో కంటే కూడా వేరే విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె రాజకీయ వ్యవహారాల్లో అవసరం లేని జోక్యంతో తన కెరీర్ను చేజేతులా దెబ్బ తీసుకుందనే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారుకు మద్దతుగా మాట్లాడ్డం మొదలుపెట్టి, ఒక దశ దాటాక భజనపరురాలిలా మారిపోవడం.. బీజేపీ వైరి పక్షాల మీద శ్రుతి మించి విమర్శలు చేయడం ఆమె చాలానే చేటు చేసింది.
కంగనా మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయి.. ఆ ప్రభావం తన సినిమాల మీద గట్టిగానే పడింది. మరోవైపు కంగనా అనేక బ్రాండ్ల ప్రచారం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. ఈ నష్టం గురించి తాజాగా కంగనా స్పందించింది. తనను ఉన్నట్లుండి అనేక బ్రాండ్ల ప్రచారం నుంచి తప్పించడంతో రూ.40 కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని.. అందుకు తనకు బాధేమీ లేదని కంగనా వ్యాఖ్యానించడం విశేషం.
‘‘నిజాలు మాట్లాడినందుకు చాలా కోల్పోవాల్సి వస్తుంది’’ అంటూ ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ చేసిన ఒక ట్వీట్పై స్పందిస్తూ తాను కూడా నిజాలు మాట్లాడి చాలా నష్టపోయినట్లు వెల్లడించింది కంగనా. ‘‘ఇది నా వ్యక్తిగతం.. నా స్వేచ్ఛ.. నా విజయం. నేను హిందూయిజానికి మద్దతుగా.. రాజకీయ నాయకులకు, దేశద్రోహులకు వ్యతిరేకంగా నిజాలు మాట్లాడినందుకు చాలా నష్టపోయా.
రాత్రికి రాత్రి 20-25 సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం చేసుకున్న ఒప్పందాల నుంచి నన్ను తప్పించాయి. దీని వల్ల ఏడాదికి 30-40 కోట్ల దాకా నష్టపోయాను. అయినా నాకేమీ బ ాధ లేదు. నేనిప్పుడు స్వేచ్ఛా జీవిని. మరింత గట్టిగా నా గళం వినిపిస్తా’’ అని కంగనా పేర్కొంది. గత ఏడాది కంగనా నటించిన ధకడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోరాతి ఘోరమైన ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుం ఆమె ఎమర్జెన్సీతో పాటు చంద్రముఖి-2 సినిమాల్లో నటిస్తోంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…