కొన్నేళ్లుగా కంగనా రనౌత్ తన సినిమాలతో కంటే కూడా వేరే విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె రాజకీయ వ్యవహారాల్లో అవసరం లేని జోక్యంతో తన కెరీర్ను చేజేతులా దెబ్బ తీసుకుందనే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారుకు మద్దతుగా మాట్లాడ్డం మొదలుపెట్టి, ఒక దశ దాటాక భజనపరురాలిలా మారిపోవడం.. బీజేపీ వైరి పక్షాల మీద శ్రుతి మించి విమర్శలు చేయడం ఆమె చాలానే చేటు చేసింది.
కంగనా మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయి.. ఆ ప్రభావం తన సినిమాల మీద గట్టిగానే పడింది. మరోవైపు కంగనా అనేక బ్రాండ్ల ప్రచారం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. ఈ నష్టం గురించి తాజాగా కంగనా స్పందించింది. తనను ఉన్నట్లుండి అనేక బ్రాండ్ల ప్రచారం నుంచి తప్పించడంతో రూ.40 కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని.. అందుకు తనకు బాధేమీ లేదని కంగనా వ్యాఖ్యానించడం విశేషం.
‘‘నిజాలు మాట్లాడినందుకు చాలా కోల్పోవాల్సి వస్తుంది’’ అంటూ ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ చేసిన ఒక ట్వీట్పై స్పందిస్తూ తాను కూడా నిజాలు మాట్లాడి చాలా నష్టపోయినట్లు వెల్లడించింది కంగనా. ‘‘ఇది నా వ్యక్తిగతం.. నా స్వేచ్ఛ.. నా విజయం. నేను హిందూయిజానికి మద్దతుగా.. రాజకీయ నాయకులకు, దేశద్రోహులకు వ్యతిరేకంగా నిజాలు మాట్లాడినందుకు చాలా నష్టపోయా.
రాత్రికి రాత్రి 20-25 సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం చేసుకున్న ఒప్పందాల నుంచి నన్ను తప్పించాయి. దీని వల్ల ఏడాదికి 30-40 కోట్ల దాకా నష్టపోయాను. అయినా నాకేమీ బ ాధ లేదు. నేనిప్పుడు స్వేచ్ఛా జీవిని. మరింత గట్టిగా నా గళం వినిపిస్తా’’ అని కంగనా పేర్కొంది. గత ఏడాది కంగనా నటించిన ధకడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోరాతి ఘోరమైన ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుం ఆమె ఎమర్జెన్సీతో పాటు చంద్రముఖి-2 సినిమాల్లో నటిస్తోంది.
This post was last modified on May 19, 2023 3:46 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…