Movie News

బాబాని గుర్తు చేస్తున్న రజనీ మాటలు

సూపర్ స్టార్ రజనీకాంత్ తన చివరి సినిమాను ఫిక్స్ చేసుకున్నారన్న వార్త అభిమానుల్లో కలకలం రేపుతోంది. లోకేష్ కనగరాజ్ తో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీతో నటనకు స్వస్తి చెబుతారని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నటుడు దర్శకుడు మిస్కిన్ అన్న మాటలు హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి తలైవా స్వయంగా ఇదేమీ చెప్పలేదు. కానీ పేరున్న డైరెక్టర్ అనడం వల్ల ఈ కామెంట్స్ కి రెక్కలొచ్చాయి. ప్రస్తుతం రజని వయసు 72. పలుమార్లు అనారోగ్యానికి  గురై అమెరికాలో సర్జరీలు చేయించుకున్నారు. 2.0 షూటింగ్ టైంలో చాలా ఇబ్బంది పడ్డారు

ఇంత జరిగినా యాక్టింగ్ మాత్రం ఆపలేదు. కానీ ఈ మధ్య శరీరం ఎంత సహకరిస్తున్నా రాబోయే కొన్నేళ్లలో వచ్చే సమస్యలను వైద్యులు తీవ్రంగా హెచ్చరించడంతో రిటైర్ మెంట్ గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారని చెన్నై టాక్. ఒకవేళ ఓటిటి లాంటి షోలు ఏమైనా చేసుకునే ఛాన్స్ ఉంటే తప్ప సినిమా కెమెరా ముందుకు రాకూడదనే నిర్ణయం తీసుకున్నారని కోలీవుడ్ మీడియా కథనం. అయితే రజని ఇలా డిసైడ్ కావడం ఇది మొదటిసారి కాదు. ఎప్పుడో 2002 బాబా టైంలోనే ఇది ఆఖరి చిత్రమని ప్రకటించడం ఫ్యాన్స్ మర్చిపోలేదు. తర్వాత ఏం జరిగిందో తెలిసిందే.

ప్రస్తుతం రజని జైలర్, లాల్ సలాంలతో బిజీగా ఉన్నారు. ఈ రెండూ ఇంకో రెండు మూడు నెలల్లో రిలీజవుతాయి. ఆ తర్వాత జై భీం ఫేమ్ టిజె జ్ఞానవేల్ ప్రాజెక్ట్ మొదలుపెడతారు. ఈలోగా లోకేష్ కనగరాజ్ ఫ్రీ అవుతాడు. స్క్రిప్ట్ పూర్తి చేసే లోపు అటు రజని వచ్చేస్తారు. సో కాంబో తేలిగ్గా సెట్ అవుతుంది. అయినా విరమణ అని చెప్పడమే కానీ లెజెండరీ స్టార్లు ఎక్కువ కాలం ఖాళీగా ఉండలేరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి, పవన్ అందరూ ఇలా చెప్పి మళ్ళీ సినిమాల్లోకి వచ్చినవాళ్లే. మరి రజని దీనికి మినహాయింపుగా ఉంటారా లేక సెలవని విశ్రాంతి కోరుకుంటారా చూడాలి 

This post was last modified on May 19, 2023 11:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు గారూ… నంది అవార్డులు ప్ర‌క‌టించండి సార్

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

1 hour ago

‘ఉస్తాద్‌’లో ఐటెం సాంగ్ ఎందుకు లేదు?

స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్‌గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…

1 hour ago

సాయిపల్లవిపై ఎందుకింత నెగెటివిటీ?

గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…

3 hours ago

బాబు కొత్త నిర్ణయం… వారి పరిస్థితి ఏమిటి?

రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని.. దీనికి మ‌హిళ‌లు కూడా సిద్ధంగా ఉండాల‌ని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…

4 hours ago

అనిల్ యానిమేషన్ మూవీ భవిష్యత్ కోసమా

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం  సబబు కాకపోయినా ఇండస్ట్రీలో…

4 hours ago

ఒక్క టికెట్ 2400 రూపాయలు… అయినా సోల్డవుట్

తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ టికెట్ రేట్లు వెయ్యి రూపాయలు టచ్ అయితేనే తీవ్రంగా అభ్యంతర పెట్టే విషయమవుతుంది. అలాంటిది దానికి…

5 hours ago