కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మార్కెట్ ప్రతి సినిమాకు పెరగడమే తప్ప ఇప్పట్లో తగ్గే సూచనలు లేవు. అందరూ టీవీ సీరియల్ లా ఉందని విమర్శించిన వారసుడుతో సైతం మూడు వందల కోట్లను రాబట్టడం విజయ్ కే చెల్లింది. పివిఆర్ మల్టీప్లెక్స్ ఇటీవలే వెల్లడించిన ఆర్థిక ఫలితాల్లో దీనిదే అగ్ర స్థానం కావడం గమనార్హం. ఇప్పుడు ఇతని రెమ్యునరేషనే 200 కోట్లని తన 68వ ప్రాజెక్ట్ కి అంత మొత్తం ఇవ్వడానికి నిర్మాత సరే అన్నారనే వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం విజయ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో లియో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఇంటరెస్టింగ్ లీక్ ఒకటి బయటికి వచ్చింది. లియోలో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి యూనిట్ ఎప్పుడో రివీల్ చేసింది. ఇటీవలే ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో సంజు భాయ్ విజయ్ ఇద్దరూ తండ్రి కొడుకులుగా కనిపిస్తారు. ఇదో గ్యాంగ్ స్టర్ డ్రామా.
మాఫియా సామ్రాజ్యానికి దూరంగా కాశ్మీర్ లో ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టుకుని ప్రశాంతంగా జీవిస్తున్న లియో జాడను కనుక్కున్న శత్రువులు అక్కడిదాకా వస్తారు. దేశం మొత్తం వణికిపోయే నాన్నను వదిలేసి లియో అక్కడికి ఎందుకు వచ్చాడనేదే అసలు పాయింటట. ఇలాంటి స్టోరీ లైన్ తో గతంలో చాలానే వచ్చాయి. ఒకకరంగా వీటికి హాలీవుడ్ క్లాసిక్ గాడ్ ఫాదరే స్ఫూర్తి.
అయితే లోకేష్ మార్క్ ట్రీట్ మెంట్ చాలా కొత్తగా ఉంటుందని విక్రమ్ లో ఎలా అయితే కమల్ హాసన్ ని ప్రెజెంట్ చేశారో అంతకు మించి అనే స్థాయిలో ఎలివేషన్లు ఇస్తారట. అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల కాబోతున్న లియోకు అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగులో బాలయ్య, రవితేజలతో గట్టి పోటీ ఎదురుకోవాల్సి ఉంటుంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ చేస్తున్న లియో బిజినెస్ ని మూడు వందల కోట్లకు టార్గెట్ చేసుకున్నారని టాక్.
This post was last modified on May 19, 2023 10:15 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…