నితిన్ తన ప్రతి సినిమాలోను టాప్ హీరోయిన్ వుండేలా చూసుకుంటున్నాడు. సమంతతో చేసిన ‘అఆ’, రష్మికతో చేసిన ‘భీష్మ’ సూపర్హిట్టవడంతో ఇక తన సినిమాల్లో టాప్ హీరోయిన్ ఎవరైనా ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. నితిన్ తదుపరి చిత్రం ‘రంగ్ దే’లో కూడా కీర్తి సురేష్ హీరోయిన్. ‘మహానటి’ తర్వాత ఆమె తెలుగులో చేసిన ఏకైక కమర్షియల్ చిత్రమిదే.
అంధాధూన్ రీమేక్ నిర్మించనున్న నితిన్ అందులో కూడా ఎవరైనా టాప్ హీరోయిన్ వుండాలనుకున్నాడు. అందుకే పూజ హెగ్డేని కాంటాక్ట్ చేసాడు. కానీ ఆమె కాల్షీట్లు మరో ఏడాదిన్నర వరకు ఖాళీ లేకపోవడంతో చేయలేనని చెప్పేసింది. ఇప్పుడిక అంత క్రేజ్ వున్న హీరోయిన్ ఎవరా అని చూస్తున్నాడు. మరోవైపు అంధాధూన్లో టబు చేసిన క్యారెక్టర్కి నయనతారను అప్రోచ్ అయ్యాడని సమాచారం.
ఆమె తొమ్మిది కోట్ల పారితోషికం అడిగిందనే విచిత్రమైన వార్తలు ప్రచారమవుతున్నాయి. సింపుల్గా చేసేద్దామనుకున్న ఈ రీమేక్ని నితిన్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడు. బడ్జెట్ ఎక్కువయినా ఫర్వాలేదు కానీ ఇందులో అంతా అదిరిపోయే కాస్టింగ్ వుండాలని ఫిక్స్ అయిపోయాడు. హిందీ వెర్షన్ చాలా మంది చూసేసి వుంటారు కనుక తెలుగు రీమేక్పై అంత పెట్టుబడి తెలివైన పని అవుతుందా లేదా అనేది రిలీజ్ అయితే కానీ తెలీదు.
This post was last modified on August 7, 2020 12:43 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…