నితిన్ తన ప్రతి సినిమాలోను టాప్ హీరోయిన్ వుండేలా చూసుకుంటున్నాడు. సమంతతో చేసిన ‘అఆ’, రష్మికతో చేసిన ‘భీష్మ’ సూపర్హిట్టవడంతో ఇక తన సినిమాల్లో టాప్ హీరోయిన్ ఎవరైనా ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. నితిన్ తదుపరి చిత్రం ‘రంగ్ దే’లో కూడా కీర్తి సురేష్ హీరోయిన్. ‘మహానటి’ తర్వాత ఆమె తెలుగులో చేసిన ఏకైక కమర్షియల్ చిత్రమిదే.
అంధాధూన్ రీమేక్ నిర్మించనున్న నితిన్ అందులో కూడా ఎవరైనా టాప్ హీరోయిన్ వుండాలనుకున్నాడు. అందుకే పూజ హెగ్డేని కాంటాక్ట్ చేసాడు. కానీ ఆమె కాల్షీట్లు మరో ఏడాదిన్నర వరకు ఖాళీ లేకపోవడంతో చేయలేనని చెప్పేసింది. ఇప్పుడిక అంత క్రేజ్ వున్న హీరోయిన్ ఎవరా అని చూస్తున్నాడు. మరోవైపు అంధాధూన్లో టబు చేసిన క్యారెక్టర్కి నయనతారను అప్రోచ్ అయ్యాడని సమాచారం.
ఆమె తొమ్మిది కోట్ల పారితోషికం అడిగిందనే విచిత్రమైన వార్తలు ప్రచారమవుతున్నాయి. సింపుల్గా చేసేద్దామనుకున్న ఈ రీమేక్ని నితిన్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడు. బడ్జెట్ ఎక్కువయినా ఫర్వాలేదు కానీ ఇందులో అంతా అదిరిపోయే కాస్టింగ్ వుండాలని ఫిక్స్ అయిపోయాడు. హిందీ వెర్షన్ చాలా మంది చూసేసి వుంటారు కనుక తెలుగు రీమేక్పై అంత పెట్టుబడి తెలివైన పని అవుతుందా లేదా అనేది రిలీజ్ అయితే కానీ తెలీదు.
This post was last modified on August 7, 2020 12:43 am
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…