నితిన్ తన ప్రతి సినిమాలోను టాప్ హీరోయిన్ వుండేలా చూసుకుంటున్నాడు. సమంతతో చేసిన ‘అఆ’, రష్మికతో చేసిన ‘భీష్మ’ సూపర్హిట్టవడంతో ఇక తన సినిమాల్లో టాప్ హీరోయిన్ ఎవరైనా ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. నితిన్ తదుపరి చిత్రం ‘రంగ్ దే’లో కూడా కీర్తి సురేష్ హీరోయిన్. ‘మహానటి’ తర్వాత ఆమె తెలుగులో చేసిన ఏకైక కమర్షియల్ చిత్రమిదే.
అంధాధూన్ రీమేక్ నిర్మించనున్న నితిన్ అందులో కూడా ఎవరైనా టాప్ హీరోయిన్ వుండాలనుకున్నాడు. అందుకే పూజ హెగ్డేని కాంటాక్ట్ చేసాడు. కానీ ఆమె కాల్షీట్లు మరో ఏడాదిన్నర వరకు ఖాళీ లేకపోవడంతో చేయలేనని చెప్పేసింది. ఇప్పుడిక అంత క్రేజ్ వున్న హీరోయిన్ ఎవరా అని చూస్తున్నాడు. మరోవైపు అంధాధూన్లో టబు చేసిన క్యారెక్టర్కి నయనతారను అప్రోచ్ అయ్యాడని సమాచారం.
ఆమె తొమ్మిది కోట్ల పారితోషికం అడిగిందనే విచిత్రమైన వార్తలు ప్రచారమవుతున్నాయి. సింపుల్గా చేసేద్దామనుకున్న ఈ రీమేక్ని నితిన్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడు. బడ్జెట్ ఎక్కువయినా ఫర్వాలేదు కానీ ఇందులో అంతా అదిరిపోయే కాస్టింగ్ వుండాలని ఫిక్స్ అయిపోయాడు. హిందీ వెర్షన్ చాలా మంది చూసేసి వుంటారు కనుక తెలుగు రీమేక్పై అంత పెట్టుబడి తెలివైన పని అవుతుందా లేదా అనేది రిలీజ్ అయితే కానీ తెలీదు.
This post was last modified on August 7, 2020 12:43 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…