నితిన్ తన ప్రతి సినిమాలోను టాప్ హీరోయిన్ వుండేలా చూసుకుంటున్నాడు. సమంతతో చేసిన ‘అఆ’, రష్మికతో చేసిన ‘భీష్మ’ సూపర్హిట్టవడంతో ఇక తన సినిమాల్లో టాప్ హీరోయిన్ ఎవరైనా ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. నితిన్ తదుపరి చిత్రం ‘రంగ్ దే’లో కూడా కీర్తి సురేష్ హీరోయిన్. ‘మహానటి’ తర్వాత ఆమె తెలుగులో చేసిన ఏకైక కమర్షియల్ చిత్రమిదే.
అంధాధూన్ రీమేక్ నిర్మించనున్న నితిన్ అందులో కూడా ఎవరైనా టాప్ హీరోయిన్ వుండాలనుకున్నాడు. అందుకే పూజ హెగ్డేని కాంటాక్ట్ చేసాడు. కానీ ఆమె కాల్షీట్లు మరో ఏడాదిన్నర వరకు ఖాళీ లేకపోవడంతో చేయలేనని చెప్పేసింది. ఇప్పుడిక అంత క్రేజ్ వున్న హీరోయిన్ ఎవరా అని చూస్తున్నాడు. మరోవైపు అంధాధూన్లో టబు చేసిన క్యారెక్టర్కి నయనతారను అప్రోచ్ అయ్యాడని సమాచారం.
ఆమె తొమ్మిది కోట్ల పారితోషికం అడిగిందనే విచిత్రమైన వార్తలు ప్రచారమవుతున్నాయి. సింపుల్గా చేసేద్దామనుకున్న ఈ రీమేక్ని నితిన్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడు. బడ్జెట్ ఎక్కువయినా ఫర్వాలేదు కానీ ఇందులో అంతా అదిరిపోయే కాస్టింగ్ వుండాలని ఫిక్స్ అయిపోయాడు. హిందీ వెర్షన్ చాలా మంది చూసేసి వుంటారు కనుక తెలుగు రీమేక్పై అంత పెట్టుబడి తెలివైన పని అవుతుందా లేదా అనేది రిలీజ్ అయితే కానీ తెలీదు.
This post was last modified on August 7, 2020 12:43 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…