చిన్న సినిమాను ప్రమోట్ చేసి దాన్ని ఆడియన్స్ దాకా తీసుకెళ్లడం పెద్ద ప్రహసనంగా మారిపోతున్న ట్రెండ్ లో రైటర్ పద్మభూషణ్ ద్వారా దాన్ని విజయవంతంగా చేసి చూపించిన ఛాయ్ బిస్కెట్ టీమ్ ఇప్పుడు మేం ఫేమస్ తో వస్తోంది. సుమంత్ ప్రభాస్ ని హీరోగా దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ మూవీ తాలూకు ట్రైలర్ ని హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా లాంచ్ చేయడంతో మూవీ లవర్స్ దృష్టి దీని మీద పడింది.
గత పది రోజులుగా సెలబ్రిటీలతో చేస్తున్న చిన్న వీడియో ప్రోమోలు ట్విట్టర్ లో బాగానే వైరల్ అయ్యాయి. ఇక కథ విషయానికి వస్తే తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరు. ఉదయం లేచినప్పటి నుంచి బేవార్స్ గా తిరగడం తప్ప మరో పని లేని ముగ్గురు కుర్రాళ్లు. ఇంట్లో వాళ్ళతోనే కాదు బయటి జనాలతోనూ తిట్టించుకోవడం వీళ్ళ స్పెషాలిటీ. ఎంత ఖాళీగా ఉన్నా సరే ప్రేమలో పడి లవర్స్ ని సెట్ చేసుంటారు. అంతా బాగుందనుకుంటున్న టైంలో ఓ సమస్య వచ్చి పడుతుంది.
దీంతో సరదగా గడిచిపోతున్న ఈ త్రీ ఇడియట్స్ కి బాధ్యతలు వచ్చి పడతాయి. తమను తాము నిరూపించుకునేందుకు ఓ పని మొదలుపెడతారు. అదేంటి అందులో ఎలా ఫేమస్ అయ్యారో అదే అసలు ట్విస్టు. ఇది మరో నైజామ్ స్టోరీ. బలగం తరహాలో పూర్తిగా అదే యాస నేటివిటీతో తీశాడు సుమంత్ ప్రభాస్. జాతిరత్నాలు తరహా క్యారెక్టరైజేషన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సరదాగా సాగిపోయే హాస్యం, సహజత్వం యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. కళ్యాణ్ నాయక్ సంగీతం హుషారుగా సాగగా క్యాస్టింగ్ దాదాపుగా కొత్త మొహాలతోనే ఉన్నా యాక్టింగ్ పరంగా అనుభవమున్నవాళ్ళ లాగే చేశారు. టార్గెట్ చేసుకున్న యువతకి టైం పాస్ అయ్యేలా చూపిస్తూనే చివర్లో మంచి మెసేజ్ ఏదో దట్టించారు. కంటెంట్ కనక కలర్ ఫుల్ ఉంటే సమ్మర్ లో మరో సర్ప్రైజ్ హిట్ పడ్డట్టే.
This post was last modified on May 18, 2023 8:56 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…