ఉప్పెన లాంటి బ్లాక్బస్టర్ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు మెగా కుర్రాడు పంజా వైష్ణవ్ తేజ్. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సహా ఏ అరంగేట్ర హీరోకూ సాధ్యం కాని వసూళ్లను తన తొలి చిత్రంతో అతను సాధించగలిగాడు. అది పూర్తిగా అతడి ఘనత అని చెప్పలేం కానీ.. ఊహించని రికార్డులైతే తన పేరు మీద నమోదయ్యాయి. కానీ ఈ సక్సెస్ను అతను నిలబెట్టుకోలేకపోయాడు.
వైష్ణవ్ తర్వాతి రెండు చిత్రాలు కొండపొలం, రంగ రంగ వైభవంగా చేదు అనుభవాలను మిగిల్చాయి. ఇప్పుడు అతడి ఆశలన్నీ సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ఆదికేశవ మీదే ఉన్నాయి. ఈ రోజే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ టీజర్ లాంచ్ చేశారు. ఈసారి వైష్ణవ్ పూర్తి స్థాయి మాస్ సినిమా చేస్తున్న సంకేతాలను ఈ టీజర్ ఇచ్చింది. కానీ ఈ టీజర్ చూసిన వాళ్లకు కొన్ని భయాలు కూడా కలిగాయి.
గుడిని టార్గెట్ చేసే విలన్ బ్యాచ్.. వారిని అడ్డుకుని గుడికి రక్షణగా నిలిచే హీరో.. ఇదీ టీజర్లో కనిపించిన లైన్. ఇదే లైన్ గత ఏడాది ఆచార్య సినిమాలో చూశాం. చిరంజీవి నటించిన ఆ చిత్రం మెగా అభిమానులకు ఒక పీడకలలా మిగిలిపోయింది. వైష్ణవ్ కూడా మెగా ఫ్యామిలీ హీరోనే కావడం.. స్టోరీ లైన్ ఆచార్యకు దగ్గరగా ఉండటంతో ఆ సినిమా తాలూకు చేదు అనుభవాలన్నీ గుర్తుకు వస్తున్నాయి.
స్టోరీ లైన్ దగ్గరగా ఉన్నంతమాత్రాన సినిమా కూడా అలాంటి ఫలితాన్నే అందుకుంటుందని చెప్పలేం కానీ.. మెగా అభిమానులైతే కొంత కంగారు పడుతున్నారు. టీజర్లో అంతగా కొత్తదనం ఏమీ కూడా కనిపించలేదు. మరి త్రివిక్రమ్ ఓకే చేసి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సినిమా కాబట్టి కంటెంట్ ఉన్నదే అయి ఉంటుందని ఆశిస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఈ చిత్రం జులైలో విడుదల కానుంది.
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…