ఉప్పెన లాంటి బ్లాక్బస్టర్ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు మెగా కుర్రాడు పంజా వైష్ణవ్ తేజ్. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సహా ఏ అరంగేట్ర హీరోకూ సాధ్యం కాని వసూళ్లను తన తొలి చిత్రంతో అతను సాధించగలిగాడు. అది పూర్తిగా అతడి ఘనత అని చెప్పలేం కానీ.. ఊహించని రికార్డులైతే తన పేరు మీద నమోదయ్యాయి. కానీ ఈ సక్సెస్ను అతను నిలబెట్టుకోలేకపోయాడు.
వైష్ణవ్ తర్వాతి రెండు చిత్రాలు కొండపొలం, రంగ రంగ వైభవంగా చేదు అనుభవాలను మిగిల్చాయి. ఇప్పుడు అతడి ఆశలన్నీ సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ఆదికేశవ మీదే ఉన్నాయి. ఈ రోజే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ టీజర్ లాంచ్ చేశారు. ఈసారి వైష్ణవ్ పూర్తి స్థాయి మాస్ సినిమా చేస్తున్న సంకేతాలను ఈ టీజర్ ఇచ్చింది. కానీ ఈ టీజర్ చూసిన వాళ్లకు కొన్ని భయాలు కూడా కలిగాయి.
గుడిని టార్గెట్ చేసే విలన్ బ్యాచ్.. వారిని అడ్డుకుని గుడికి రక్షణగా నిలిచే హీరో.. ఇదీ టీజర్లో కనిపించిన లైన్. ఇదే లైన్ గత ఏడాది ఆచార్య సినిమాలో చూశాం. చిరంజీవి నటించిన ఆ చిత్రం మెగా అభిమానులకు ఒక పీడకలలా మిగిలిపోయింది. వైష్ణవ్ కూడా మెగా ఫ్యామిలీ హీరోనే కావడం.. స్టోరీ లైన్ ఆచార్యకు దగ్గరగా ఉండటంతో ఆ సినిమా తాలూకు చేదు అనుభవాలన్నీ గుర్తుకు వస్తున్నాయి.
స్టోరీ లైన్ దగ్గరగా ఉన్నంతమాత్రాన సినిమా కూడా అలాంటి ఫలితాన్నే అందుకుంటుందని చెప్పలేం కానీ.. మెగా అభిమానులైతే కొంత కంగారు పడుతున్నారు. టీజర్లో అంతగా కొత్తదనం ఏమీ కూడా కనిపించలేదు. మరి త్రివిక్రమ్ ఓకే చేసి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సినిమా కాబట్టి కంటెంట్ ఉన్నదే అయి ఉంటుందని ఆశిస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఈ చిత్రం జులైలో విడుదల కానుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…