ఎంత పెద్ద స్టార్ కావొచ్చు. మరెంత ప్రముఖుడు కావొచ్చు. రూల్ ప్రకారం కొన్నిసార్లు తప్పనిసరిగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లక తప్పని పరిస్థితి. తాజాగా అలాంటి పరిస్థితే డార్లింగ్ ప్రభాస్ కు ఎదురైంది. కరోనా వేళ.. స్టార్ హీరోలు ఎవరు బయటకు అడుగు పెట్టని పరిస్థితి. ఇందుకు భిన్నంగా ప్రభాస్ మాత్రం ఖైరతాబాద్ లోని ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లారు.
ఇటీవల ఆయన కొన్న కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లారు. నిబంధనల ప్రకారం కారు యజమాని ఎవరైనా తప్పనిసరిగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి ఈ-సంతకం పెట్టాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్కు ధరించిన కార్యాలయానికి వచ్చారు. తమ ఆఫీసుకు వచ్చింది ప్రభాస్ అన్న విషయం తెలిసిన వెంటనే.. ఆర్టీఏ అధికారులు ఆయన్నుచూసేందుకు.. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.
ప్రభాస్ వచ్చారన్న విషయం తెలిసిన అక్కడికి వచ్చిన వారు ఆఫీసు ముందు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీంతో.. అక్కడి సందడి వాతావరణం నెలకొంది. కాకుంటే.. ఈ హడావుడికి ప్రభాస్ మాత్రం కాస్త ఇబ్బందికి గురైనట్లు చెబుతున్నారు. తనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిన అందరితోనూ ఓపిగ్గా ఫోటోలు దిగి వెనుదిరిగారు.
This post was last modified on August 6, 2020 7:44 pm
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…