ఎంత పెద్ద స్టార్ కావొచ్చు. మరెంత ప్రముఖుడు కావొచ్చు. రూల్ ప్రకారం కొన్నిసార్లు తప్పనిసరిగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లక తప్పని పరిస్థితి. తాజాగా అలాంటి పరిస్థితే డార్లింగ్ ప్రభాస్ కు ఎదురైంది. కరోనా వేళ.. స్టార్ హీరోలు ఎవరు బయటకు అడుగు పెట్టని పరిస్థితి. ఇందుకు భిన్నంగా ప్రభాస్ మాత్రం ఖైరతాబాద్ లోని ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లారు.
ఇటీవల ఆయన కొన్న కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లారు. నిబంధనల ప్రకారం కారు యజమాని ఎవరైనా తప్పనిసరిగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి ఈ-సంతకం పెట్టాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్కు ధరించిన కార్యాలయానికి వచ్చారు. తమ ఆఫీసుకు వచ్చింది ప్రభాస్ అన్న విషయం తెలిసిన వెంటనే.. ఆర్టీఏ అధికారులు ఆయన్నుచూసేందుకు.. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.
ప్రభాస్ వచ్చారన్న విషయం తెలిసిన అక్కడికి వచ్చిన వారు ఆఫీసు ముందు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీంతో.. అక్కడి సందడి వాతావరణం నెలకొంది. కాకుంటే.. ఈ హడావుడికి ప్రభాస్ మాత్రం కాస్త ఇబ్బందికి గురైనట్లు చెబుతున్నారు. తనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిన అందరితోనూ ఓపిగ్గా ఫోటోలు దిగి వెనుదిరిగారు.
This post was last modified on August 6, 2020 7:44 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…