బిచ్చగాడు వచ్చి ఎనిమిదేళ్లయ్యింది. అయినా తెలుగునాట దాని బ్రాండ్ ఇంకా బలంగా ఉందని చెప్పడానికి నిదర్శనం సీక్వెల్ కి జరుగుతున్న బిజినెస్. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఏపీ తెలంగాణ కలిపి డబ్బింగ్ వెర్షన్ కు సుమారు 6 కోట్లకు థియేట్రికల్ రైట్స్ విక్రయించారట. అంటే లాభాలు రావాలంటే ఇంకో కోటి కలుపుకుని మొత్తం షేర్ రూపంలో వసూలు చేయాలి. ఇది భారీ టాస్కే. షూటింగ్ జరుగుతున్న టైంలో పెద్దగా బజ్ లేదు కానీ ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. ఈసారి తల్లికి బదులు చెల్లి సెంటిమెంట్ ని తీసుకొచ్చారు.
బిచ్చగాడు 2 మీద బయ్యర్లు ఇంతగా నమ్మకం పెట్టుకోవడానికి కారణాలు లేకపోలేదు. గత రెండు మూడు వారాలుగా బాక్సాఫీస్ వద్ద మాస్ కి ఫ్యామిలీస్ కి ఒకేసారి రీచ్ అయ్యే కంటెంట్ ఉన్న సినిమాలు రాలేదు. ఏజెంట్ తో మొదలుపెట్టి కస్టడీ దాకా అన్నీ డిజాస్టర్లే. ది కేరళ స్టోరీ దేశం మొత్తం ప్రభంజనం సృష్టించినా ఇక్కడ మరీ అద్భుతాలేం చేయడం లేదు. వచ్చే వారం 18న అన్నీ మంచి శకునములే వస్తోంది. ఇది పూర్తిగా కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుంది. టాక్ బాగున్నా బిచ్చగాడు 2కి వచ్చిన ఇబ్బందేమీ లేదు. థియేటర్ల సమస్య అసలే ఉండదు.
ఈ క్యాలికులేషన్ల దృష్ట్యా బిచ్చగాడు 2 సేఫ్ గేమ్ అవుతుందనే లెక్కలో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అయితే విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తనే సంగీతం అందించి నిర్మించిన ఈ ఎమోషనల్ డ్రామాని ఎంత మేరకు హ్యాండిల్ చేశాడనే దాని మీదే హిట్ కొట్టడం ఆధారపడి ఉంటుంది. బిచ్చగాడు తర్వాత ఈ హీరోకి తెలుగులో కనీసం యావరేజ్ హిట్ దక్కలేదు. చాలా సినిమాలు వచ్చాయి కానీ ఏవీ కనీస స్థాయిలో ఆడలేదు. ఇంత డిజాస్టర్ ట్రాక్ రికార్డుతోనూ ఆరు కోట్లంటే మాటలు కాదు. మరి అంత మొత్తాన్ని రాబడితే మాత్రం మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుంది
This post was last modified on May 15, 2023 6:10 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…