టాలీవుడ్లో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోయే హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకడు. దసరా, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్బస్టర్ల తర్వాత ఇటీవలే ‘రావణాసుర’తో ఎదురు దెబ్బ తిన్న రవితేజ.. దాన్నుంచి మూవ్ ఆన్ అయిపోయి రెండు సినిమాల షూటింగ్లో సమాంతరంగా పాల్గొంటున్నాడు.
వంశీ ఆకెళ్ళ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ చేస్తూనే.. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనితో ‘ఈగల్’ అనే మూవీలోనూ నటిస్తున్నాడు మాస్ రాజా. ఇప్పుడు ఆయన కొత్త సినిమా ఖరారైనట్లు సమాచారం. ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేసే రవితేజ.. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చేయబోతున్నాడిప్పుడు.
ఆయన యువ దర్శకుడు అనుదీప్ కేవీతో జట్టు కట్టబోతున్నాడు. ‘జాతిరత్నాలు’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనుదీప్.. ఆ తర్వాత ‘ప్రిన్స్’తో నిరాశపరిచాడు. అయినా అతణ్ని నమ్మి సినిమా చేయబోతున్నాడు రవితేజ.
‘జాతిరత్నాలు’తో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న అనుదీప్.. అనవసరంగా తమిళ హీరో శివ కార్తికేయన్తో జట్టు కట్టాడు. ‘జాతిరత్నాలు’ తరహాలోనే కామెడీ పండించడానికి ప్రయత్నించాడు కానీ.. అతడి టైమింగ్కు తమిళ హీరో సెట్ కాలేదు. మన హీరోలతో.. ఇక్కడి నేటివిటీతో అతను సినిమా చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
‘ప్రిన్స్’ పోయిందని అనుదీప్ మీద తెలుగు ప్రేక్షకులకేమీ నమ్మకం పోలేదు. అతను మళ్లీ తన మార్కు సినిమా తీయగలడనే నమ్ముతున్నారు. రవితేజ ఆ నమ్మకంతోనే అతడికి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. రవితేజ పక్కన కొంచెం సీనియర్ అయిన హీరోయిన్నే పెట్టుకోవాలని చూస్తున్నారట. తమన్నా, త్రిషల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందట.
This post was last modified on May 14, 2023 6:02 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…