టాలీవుడ్లో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోయే హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకడు. దసరా, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్బస్టర్ల తర్వాత ఇటీవలే ‘రావణాసుర’తో ఎదురు దెబ్బ తిన్న రవితేజ.. దాన్నుంచి మూవ్ ఆన్ అయిపోయి రెండు సినిమాల షూటింగ్లో సమాంతరంగా పాల్గొంటున్నాడు.
వంశీ ఆకెళ్ళ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ చేస్తూనే.. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనితో ‘ఈగల్’ అనే మూవీలోనూ నటిస్తున్నాడు మాస్ రాజా. ఇప్పుడు ఆయన కొత్త సినిమా ఖరారైనట్లు సమాచారం. ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేసే రవితేజ.. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చేయబోతున్నాడిప్పుడు.
ఆయన యువ దర్శకుడు అనుదీప్ కేవీతో జట్టు కట్టబోతున్నాడు. ‘జాతిరత్నాలు’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనుదీప్.. ఆ తర్వాత ‘ప్రిన్స్’తో నిరాశపరిచాడు. అయినా అతణ్ని నమ్మి సినిమా చేయబోతున్నాడు రవితేజ.
‘జాతిరత్నాలు’తో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న అనుదీప్.. అనవసరంగా తమిళ హీరో శివ కార్తికేయన్తో జట్టు కట్టాడు. ‘జాతిరత్నాలు’ తరహాలోనే కామెడీ పండించడానికి ప్రయత్నించాడు కానీ.. అతడి టైమింగ్కు తమిళ హీరో సెట్ కాలేదు. మన హీరోలతో.. ఇక్కడి నేటివిటీతో అతను సినిమా చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
‘ప్రిన్స్’ పోయిందని అనుదీప్ మీద తెలుగు ప్రేక్షకులకేమీ నమ్మకం పోలేదు. అతను మళ్లీ తన మార్కు సినిమా తీయగలడనే నమ్ముతున్నారు. రవితేజ ఆ నమ్మకంతోనే అతడికి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. రవితేజ పక్కన కొంచెం సీనియర్ అయిన హీరోయిన్నే పెట్టుకోవాలని చూస్తున్నారట. తమన్నా, త్రిషల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందట.
This post was last modified on May 14, 2023 6:02 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…