ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో మంచి స్పీడు మీదున్నది పవన్ కళ్యాణ్, ప్రభాస్లే. మామూలుగా వీళ్లిద్దరూ నెమ్మదిగా సినిమాలు చేసేవాళ్లే. కానీ ఇప్పుడు వీళ్లు ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్టుల్లో పని చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ ఉచ్చులో చిక్కుకుని కొంచెం నెమ్మదించిన ప్రభాస్.. తర్వాత స్పీడు పెంచేశాడు.
ఆల్రెడీ ‘ఆదిపురుష్’ను పూర్తి చేసి.. ‘సలార్’ను కూడా ఒక కొలిక్కి తెచ్చేశాడు. మారుతి సినిమా కూడా చకచకా రెడీ అవుతోంది. ‘ప్రాజెక్ట్-కే’ కోసం కూడా వీలైనన్ని ఎక్కువ డేట్లు ఇచ్చి దాన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. ఇలా తీరిక లేకుండా సినిమాలు చేస్తూనే.. మరోవైపు కొత్త కథలు వింటున్నాడు ప్రభాస్. ఐతే ప్రభాస్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్న మాట ఏంటంటే.. తాను పాన్ ఇండియా స్టార్ అయ్యాక అందరూ ఎక్కువగా పెద్ద కాన్వాస్ ఉన్న యాక్షన్ కథలే చెబుతున్నారని.
ఇమేజ్ ఛట్రం నుంచి బయటపడి.. మళ్లీ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి తరహాలో ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమాలు చేయాలని ప్రభాస్ కోరుకుంటున్నాడట. ఆ తరహా కథలు తీసుకురమ్మని తనను సంప్రదిస్తున్న నిర్మాతలతో చెబుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ దిల్ రాజుతో పాటు మరో సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్లతో సినిమాలు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ‘సలార్’ చేస్తున్న ప్రభాస్, ప్రశాంత్ నీల్ల కాంబినేషన్లోనే ఒక సినిమా చేసే ప్రపోజల్ దిల్ రాజు దగ్గర ఉన్నప్పటికీ.. అది కార్యరూపం దాల్చడానికి చాలా టైం పట్టేలా ఉంది.
ఈలోపు తమ సంస్థకు ఎన్నో విజయాలందించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో ప్రభాస్ హీరోగా ఒక సినిమా చేయాలని దిల్ రాజు చూస్తున్నట్లు సమాచారం. మరోవైపు ‘ఛత్రపతి’ తర్వాత ప్రభాస్ మళ్లీ తనకు కమిట్మెంట్ ఇవ్వడంతో ప్రసాద్ సైతం ఫ్యామిలీ స్టోరీ వేటలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడి.. ఫ్యామిలీ టచ్ ఉన్న లవ్ స్టోరీనే ప్రభాస్ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి వీటిలో దేనికి ప్రభాస్ ఫైనల్గా ఓకే చెప్పి సెట్స్ మీదికి తీసుకెళ్తాడో చూడాలి.
This post was last modified on May 14, 2023 11:59 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…