ఒక్క సినిమా ఫలితంతో రాత్రికి రాత్రి కెరీర్లు మారిపోతూ ఉంటాయి. ఎవ్వరికీ పట్టని వాళ్లు బిజీ అయిపోవచ్చు. అందరూ వెంటపడేవాళ్లు ఖాళీ అయిపోవచ్చు. ఎక్కడైనా సక్సెస్కు ప్రాధాన్యం ఎక్కువే కానీ.. సక్సెస్ రేట్ మరీ తక్కువైన ఫిలిం ఇండస్ట్రీలో దానికి మరింత విలువ ఉంటుంది. అందుకే శుక్రవారంతో జీవితాలు అనూహ్యంగా మారిపోతుంటాయి.
‘ఏజెంట్’ సినిమాకు ముందు మంచి క్రేజ్తో కనిపించిన సురేందర్ రెడ్డి ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంలో మేజర్ బ్లేమ్.. సురేందరే తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందు సూరితో సినిమా చేయడానికి ఆసక్తితో ఉన్న అల్లు అర్జున్.. ఇప్పుడు ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. ‘ఏజెంట్’ రిలీజ్ తర్వాత కూడా.. బన్నీ కోసం సూరి కథ మీద కొంత వర్క్ చేసినప్పటికీ.. తర్వాతి రోజుల్లో పరిస్థితి మారిపోయినట్లు తెలుస్తోంది.
సినిమాల ఎంపికలో బన్నీ ఎంత జాగ్రత్తగా ఉంటాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతంలో విక్రమ్ కుమార్, లింగుస్వామి లాంటి దర్శకులతో కొన్ని నెలల పాటు ట్రావెల్ చేసి.. తర్వాత వెనక్కి తగ్గాడు. మురుగదాస్ లాంటి దర్శకుడికి కూడా ఇలాంటి అనుభవం తప్పలేదు. ఇప్పుడు సూరి పరిస్థితి కూడా ఇలాగే అయిందంటున్నారు. బన్నీతో సినిమా ఓకే అయ్యే ఛాన్స్ దాదాపుగా లేదని తేలిపోవడంతో అతను వేరే దారి చూసుకుంటున్నట్లు సమాచారం.
నితిన్తో అతను కొత్త సినిమా చేయడానికి చూస్తున్నాడట. సూరి ఆస్థాన రచయిత వక్కంతం వంశీతో నితిన్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత సూరితో జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయట. మరి దీనికి కూడా వంశీనే కథ అందిస్తాడా లేదా అన్నది క్లారిటీ లేదు. కానీ నితిన్, సూరి కాంబో మాత్రం దాదాపు ఓకే అయినట్లు సమాచారం.
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో…
భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు,…
టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ…
2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని…
కొత్త సినిమాలకు ప్రమోషన్ తగ్గినా కష్టమే. ప్రచారం మరీ ఎక్కువైనా ప్రమాదమే. వీలైనంత ఎక్కువగా ప్రమోషన్లు చేసి జనం దృష్టి…
టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు…