సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా చెల్లిపోతుంది.. యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూలో ఎన్ని వేషాలేసినా నడిచిపోద్ది అనుకునేవారికి ఈ ఉదంతం ఒక గుణపాఠం లాంటిదే. సునిశిత్ అనే ఒక కుర్రాడు కొన్నేళ్ల నుంచి యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూల్లో చెబుతున్న మాటలు, వేస్తున్న వేషాల గురించి సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు బాగానే తెలిసి ఉంటుంది.
1 నేనొక్కడినే సినిమాలో నేనే హీరో.. ముందు నన్నే తీసుకున్నారు.. తర్వాత మహేష్ వచ్చాడు.. లావణ్య త్రిపాఠికి నాకు పెళ్లయింది.. నా వల్ల ఆమె ప్రెగ్నెంట్ కూడా అయింది.. తర్వాత విడిపోయాం.. ఇలాంటి మాటలే ఉంటాయి అతడి ఇంటర్వ్యూల నిండా. యూట్యూబ్ ఛానెళ్ల వాళ్లు కూడా.. ఇతను చెప్పేవన్నీ అబద్ధాలని తెలిసినా తనతో ఇంటర్వ్యూలు చేస్తుంటారు. అతను కూడా అవే మాటలు రిపీట్ చేస్తూ ఉంటాడు. అందుకే అతడికి ‘శాక్రిఫయింగ్ స్టార్’ అని నెటిజన్లు కామెడీగా ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు.
ఇలాంటివి చూసి అందరూ నవ్వుకుని వదిలేయరు. సీరియస్గా తీసుకునేవాళ్లూ ఉంటారు. ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి కామెంట్లు చేశాడు. ఉపాసనతో లాంగ్ డ్రైవ్ వెళ్లా అని.. తాను చిరంజీవి అల్లుడు కావాల్సిన వాడినని.. ఇలా సాగాయి అతడి మాటలు. మెగా అభిమానులు ఈ కామెంట్లను అంత తేలిగ్గా తీసుకోలేదు.
కొందరు ఫ్యాన్స్ తాజాగా సునిశిత్ను ఎక్కడో ఒక చోట పట్టుకున్నారు. నలుగురైదుగురు అభిమానులు కలిసి అతణ్ని చితకబాదారు. ఇదంతా వీడియో కూడా తీశారు. తర్వాత అతడి ముందు మైక్ పెట్టి తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కూడా చెప్పించారు. తనను చరణ్ అభిమానులు ఎందుకు కొట్టారో వివరిస్తూ.. తాను మాట్లాడింది తప్పని.. అందుకు చింతిస్తున్నానని.. ఇకపై ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయనని.. తప్పయిపోయిందని సునిశిత్ లెంపలేసుకున్నాడు.
This post was last modified on May 13, 2023 9:08 pm
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…