సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా చెల్లిపోతుంది.. యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూలో ఎన్ని వేషాలేసినా నడిచిపోద్ది అనుకునేవారికి ఈ ఉదంతం ఒక గుణపాఠం లాంటిదే. సునిశిత్ అనే ఒక కుర్రాడు కొన్నేళ్ల నుంచి యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూల్లో చెబుతున్న మాటలు, వేస్తున్న వేషాల గురించి సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు బాగానే తెలిసి ఉంటుంది.
1 నేనొక్కడినే సినిమాలో నేనే హీరో.. ముందు నన్నే తీసుకున్నారు.. తర్వాత మహేష్ వచ్చాడు.. లావణ్య త్రిపాఠికి నాకు పెళ్లయింది.. నా వల్ల ఆమె ప్రెగ్నెంట్ కూడా అయింది.. తర్వాత విడిపోయాం.. ఇలాంటి మాటలే ఉంటాయి అతడి ఇంటర్వ్యూల నిండా. యూట్యూబ్ ఛానెళ్ల వాళ్లు కూడా.. ఇతను చెప్పేవన్నీ అబద్ధాలని తెలిసినా తనతో ఇంటర్వ్యూలు చేస్తుంటారు. అతను కూడా అవే మాటలు రిపీట్ చేస్తూ ఉంటాడు. అందుకే అతడికి ‘శాక్రిఫయింగ్ స్టార్’ అని నెటిజన్లు కామెడీగా ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు.
ఇలాంటివి చూసి అందరూ నవ్వుకుని వదిలేయరు. సీరియస్గా తీసుకునేవాళ్లూ ఉంటారు. ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి కామెంట్లు చేశాడు. ఉపాసనతో లాంగ్ డ్రైవ్ వెళ్లా అని.. తాను చిరంజీవి అల్లుడు కావాల్సిన వాడినని.. ఇలా సాగాయి అతడి మాటలు. మెగా అభిమానులు ఈ కామెంట్లను అంత తేలిగ్గా తీసుకోలేదు.
కొందరు ఫ్యాన్స్ తాజాగా సునిశిత్ను ఎక్కడో ఒక చోట పట్టుకున్నారు. నలుగురైదుగురు అభిమానులు కలిసి అతణ్ని చితకబాదారు. ఇదంతా వీడియో కూడా తీశారు. తర్వాత అతడి ముందు మైక్ పెట్టి తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కూడా చెప్పించారు. తనను చరణ్ అభిమానులు ఎందుకు కొట్టారో వివరిస్తూ.. తాను మాట్లాడింది తప్పని.. అందుకు చింతిస్తున్నానని.. ఇకపై ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయనని.. తప్పయిపోయిందని సునిశిత్ లెంపలేసుకున్నాడు.
This post was last modified on May 13, 2023 9:08 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…