కరోనా టైంలో సినిమా వాళ్లు చాలామంది చాలా రకాలుగా సాయాలు చేశారు. అందరిలోకి సోనూ సూద్ గొప్ప సాయాలు చేసి హీరోగా నిలిచాడు. ఐతే అతడితో పోల్చి మిగతా సెలబ్రెటీలను తక్కువ చేయడం కరెక్టా అన్నది జనాలు ఆలోచించాలి. తమ వంతుగా ఏమీ చేయని వాళ్లు సెలబ్రెటీలను మాత్రం టార్గెట్ చేసి మీరేం చేశారని నిలదీస్తున్నారు.
సెలబ్రెటీలు సాయం చేయాలని ఆశించొచ్చు కానీ.. వాళ్లను ఈ విషయంలో డిమాండ్ చేయడం.. విమర్శలు చేయడం సరి కాదు. అయినా అందరు సెలబ్రెటీలు తాము చేస్తున్న సాయాల గురించి ప్రచారం చేసుకోరు. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ కోవకే చెందుతారు. ఆయన హిందీ సినీ కార్మికులతో పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్లకు కూడా సాయం చేసిన సంగతి వేరే వాళ్లు చెబితే బయటికి వచ్చింది. అయినా సరే అమితాబ్ను తాజాగా ఓ మహిళ.. కోవిడ్ వేళ పేదవాళ్లకు మీరు చేస్తున్న సాయమేంటి అని నిలదీసింది.
దీనికి ఆయన తన బ్లాగ్ ద్వారా సమాధానం ఇచ్చారు. ‘‘కోవిడ్ వేళ నా దాతృత్వం గురించి ఓ మహిళ ప్రశ్నించింది. చేసిన సహాయం గురించి ప్రచారం చేసుకోకూడదని నేను నమ్ముతాను. కానీ మాట్లాడాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. ఆంధ్రప్రదేశ్, విదర్భ, యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులకు సహాయం చేశాం. సినీ పరిశ్రమకు చెందిన పది వేల కుటుంబాలకు ఆరు నెలలుగా రేషన్, ఆహారం అందిస్తున్నాం.
ముంబయి నుంచి తమ స్వగ్రామాలకు కాలినడకన బయల్దేరిన వలస కార్మికులకు 12,000 జతల చెప్పులు అందించాం. నాసిక్ హైవే మీద వాళ్లకు ఆహారం, నీళ్లు అందించాం. చార్టెట్ విమానాల ద్వారా వీలైనంత మందిని వారి స్వగ్రామాలకు తరలించాం. కరోనా యోధులకు 15 వేల పీపీఈ కిట్లు 10 వేల మాస్కులు అందించాం`’ అంటూ తన వైపు నుంచి అభాగ్యులకు ఏ స్థాయిలో సాయం అందింది వివరంగా చెప్పుకొచ్చారు అమితాబ్.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…