కరోనా టైంలో సినిమా వాళ్లు చాలామంది చాలా రకాలుగా సాయాలు చేశారు. అందరిలోకి సోనూ సూద్ గొప్ప సాయాలు చేసి హీరోగా నిలిచాడు. ఐతే అతడితో పోల్చి మిగతా సెలబ్రెటీలను తక్కువ చేయడం కరెక్టా అన్నది జనాలు ఆలోచించాలి. తమ వంతుగా ఏమీ చేయని వాళ్లు సెలబ్రెటీలను మాత్రం టార్గెట్ చేసి మీరేం చేశారని నిలదీస్తున్నారు.
సెలబ్రెటీలు సాయం చేయాలని ఆశించొచ్చు కానీ.. వాళ్లను ఈ విషయంలో డిమాండ్ చేయడం.. విమర్శలు చేయడం సరి కాదు. అయినా అందరు సెలబ్రెటీలు తాము చేస్తున్న సాయాల గురించి ప్రచారం చేసుకోరు. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ కోవకే చెందుతారు. ఆయన హిందీ సినీ కార్మికులతో పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్లకు కూడా సాయం చేసిన సంగతి వేరే వాళ్లు చెబితే బయటికి వచ్చింది. అయినా సరే అమితాబ్ను తాజాగా ఓ మహిళ.. కోవిడ్ వేళ పేదవాళ్లకు మీరు చేస్తున్న సాయమేంటి అని నిలదీసింది.
దీనికి ఆయన తన బ్లాగ్ ద్వారా సమాధానం ఇచ్చారు. ‘‘కోవిడ్ వేళ నా దాతృత్వం గురించి ఓ మహిళ ప్రశ్నించింది. చేసిన సహాయం గురించి ప్రచారం చేసుకోకూడదని నేను నమ్ముతాను. కానీ మాట్లాడాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. ఆంధ్రప్రదేశ్, విదర్భ, యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులకు సహాయం చేశాం. సినీ పరిశ్రమకు చెందిన పది వేల కుటుంబాలకు ఆరు నెలలుగా రేషన్, ఆహారం అందిస్తున్నాం.
ముంబయి నుంచి తమ స్వగ్రామాలకు కాలినడకన బయల్దేరిన వలస కార్మికులకు 12,000 జతల చెప్పులు అందించాం. నాసిక్ హైవే మీద వాళ్లకు ఆహారం, నీళ్లు అందించాం. చార్టెట్ విమానాల ద్వారా వీలైనంత మందిని వారి స్వగ్రామాలకు తరలించాం. కరోనా యోధులకు 15 వేల పీపీఈ కిట్లు 10 వేల మాస్కులు అందించాం`’ అంటూ తన వైపు నుంచి అభాగ్యులకు ఏ స్థాయిలో సాయం అందింది వివరంగా చెప్పుకొచ్చారు అమితాబ్.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…