‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా’ పాట ఒక సెన్సేషన్. ఈ పాట రిలీజైనపుడు సోసోగా అనిపించినా.. తర్వాత అది ఒక ఊపు ఊపేసింది. ఆడియో పరంగా ఈ పాట రేపిన సంచలనం ఒకెత్తయితే.. వీడియో పరంగా క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇంకో ఎత్తు.
ఇందులో సమంత నెవర్ బిఫోర్ అన్నట్లుగా హాట్ హాట్గా కనిపించి యూత్కు కిర్రెక్కించింది. కెరీర్లో ఎక్కువగా ట్రెడిషనల్ రో్ల్సే చేసిన సమంతను అంత సెక్సీగా చూపించడమే పెద్ద షాక్. స్టార్ హీరోయిన్లు అలా కనిపించడానికి మామూలుగా అంగీకరించరు. ఈ పాటను వేరే స్టార్ హీరోయిన్లకు ఆఫర్ చేస్తే ఒప్పుకునే వాళ్లా అన్నది సందేహమే. ఉదాహరణకు ‘ఉప్పెన’ భామ కృతి శెట్టినే అడిగితే.. తాను ఆ పాట చేసేదాన్ని కాదని అంటోంది. అలాంటి పాటలు తనకు సూట్ కావని ఆమె తేల్చేసింది.
‘‘ఊ అంటావా.. లాంటి పాటలకు నన్ను అడిగితే ప్రస్తుతానికి అలాంటివి అంగీకరించే స్థితిలో లేను. అలాంటి పాటలు ఎలా చేయాలన్న అవగాహన కూడా నాకు లేదు. ఇప్పటి వరకు నా కెరీర్లో నేను తెలుసుకున్నది ఒక్కటే. మనకు సౌకర్యంగా అనిపించనపుడు ఏదీ చేయకూడదు. నాకు ఊ అంటావా పాట ఇష్టమే. అందులో సమంత అద్భుతంగా డ్యాన్స్ చేశారు.
ఆమె ఒక ఫైర్’’ అని కృతి శెట్టి చెప్పింది. ‘శ్యామ్ సింగ రాయ్’లో లిప్ లాక్, ఇంటిమేట్ సీన్లు చేయడానికి తాను బాగా ఇబ్బంది పడ్డట్లు కృతి ఈ సందర్భంగా వెల్లడించింది. ‘‘ఆ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్లలో నేను వంద శాతం మనస్ఫూర్తిగా నటించలేకపోయాను. హార్ట్ ఫుల్గా చేయాలని అనిపించనుపుడు వాటిని వదిలేయడమే బెటర్ అనే విషయాన్ని అప్పుడే తెలుసుకున్నా. భవిష్యత్తులో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకునే ముందుకు సాగుతా’’ అని కృతి చెప్పింది. ఆమె కథానాయికగా నటించిన ‘కస్టడీ’ శుక్రవారమే రిలీజైన సంగతి తెలిసిందే.
This post was last modified on May 13, 2023 2:02 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…