ఐశ్వర్య రాజేష్ కు ఎంత టాలెంట్ ఉన్నా సోలో హీరోయిన్ గా థియేట్రికల్ హిట్టు కొట్టిన దాఖలాలు పెద్దగా లేవు. అయితే ఓటిటిలో మాత్రం తనకు మంచి సక్సెస్ లున్నాయి. అయిదు నెలల కాలంలో అయిదు సినిమాలు రిలీజ్ కావడమంటే మాములు విషయం కాదు. నిన్న మనమంతా కస్టడీ హడావిడిలో పడిపోయాం కానీ ఫర్హానా అనే డబ్బింగ్ మూవీ ఒకటి వచ్చింది. ప్రమోషన్లు సరిగా చేయకపోవడంతో ఇదొచ్చిన సంగతే ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. గత చిత్రం డ్రైవర్ జమున డిజాస్టర్ ప్రభావం గట్టిగా ఉంది. అయితే ఫర్హానాకు సోషల్ మీడియాలో పాజిటివిటీ కనిపించడం విశేషం
ఇటీవలే వచ్చిన ది కేరళ స్టోరీ లానే ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ఐశ్వర్య రాజేష్ ముస్లిం యువతిగా నటించింది. భర్తా పిల్లలున్నప్పటికీ కుటుంబ పోషణ కోసం కాల్ సెంటర్ లో పని చేసే ఫర్హానా అనూహ్యంగా ఓ ఆగంతకుడితో ఫోన్ పరిచయం ఎమోషనల్ అటాచ్ మెంట్ కు దారి తీస్తుంది. అతనెవరో పూర్తిగా తెలియకుండా వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇక్కడే అసలు ట్విస్టులు మొదలవుతాయి. ఐశ్వర్య రాజేష్ తన నటనతో క్యారెక్టర్ ని నిలబెట్టింది. దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ ఒక డిఫరెంట్ పాయింట్ అయితే తీసుకున్నాడు.
రియలిస్టిక్ గా డీల్ చేస్తూనే విద్యా బాలన్ కహాని టైపు స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుందామని చేసిన ప్రయత్నం ఓ మోస్తరుగా ఫలించింది. అయితే సెకండ్ హాఫ్ లో జరిగిన తడబాటు, చివరి ముప్పావు గంట వచ్చిన ల్యాగ్ తో పాటు ఆశించిన స్థాయిలో క్లైమాక్స్ లేకపోవడం ఫర్హానాని బెస్ట్ మూవీగా నిలపలేకపోయింది. అయినా కూడా సినిమా చూశాక మరీ బ్యాడ్ అనిపించుకోకుండా ఓ సారి చూడొచ్చనే ఫీలింగ్ అయితే ఇస్తుంది. ముందే చెప్పినట్టు ఐశ్యర్య రాజేష్ ని చిన్నితెరపై చూడటం అలవాటయ్యాక అదే పనిగా థియేటర్ కు వెళ్లాలనిపించడం కష్టమే. అందుకే టాక్ పెరిగితే తప్ప నిలబడటం కష్టం
This post was last modified on May 13, 2023 12:52 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…