ఎంత సీనియర్ అయినా ఇప్పటికీ హీరోయిన్ వేషాలు దక్కించుకుంటున్న శ్రేయ శరన్ కు హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా సౌత్ నుంచి ఆఫర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మధ్య కబ్జలో ఉపేంద్ర సరసన నటించింది. తాజాగా మ్యూజిక్ స్కూల్ అనే సినిమాతో నిన్న థియేటర్లలో అడుగు పెట్టింది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇటీవలే కెటిఆర్ ముఖ్యఅతిధిగా హైదరాబాద్ లో చేశారు. సంగీత విశ్వవిద్యాలయం ప్రతిపాదన ఇక్కడే వచ్చింది. కనీస ఓపెనింగ్స్ కరువైన ఈ మ్యూజిక్ స్కూల్ లో థియేటర్ కు రప్పించేంత కంటెంట్ ఉందా
భాగ్యనగరంలో ఓ పెద్ద కార్పొరేట్ స్కూల్. చదువు తప్ప ఇంకేదీ పనిరాదని భావించే సిద్ధాంతమున్న పాఠశాల. డ్రామా టీచర్ మనోజ్(శర్మాన్ జోషి)కు పిల్లల్లో నాటక కళను పెంచాలనే తపన ఉంటుంది. అదే సమయంలో మ్యూజిక్ టీచర్ గా వస్తుంది మారియా(శ్రేయ శరన్). తనకూ సంగీతంతో మనోవికాసాన్ని పెంపొందించివచ్చనే ప్రణాళిక ఉంటుంది. అయితే ఈ ఇద్దరి ఆలోచనలు స్టూడెంట్స్ తల్లితండ్రులకు ససేమిరా ఇష్టం ఉండదు. ఈ నేపథ్యంలో మనోజ్, మరియాలు పిల్లలతో గోవా ట్రిప్ వెళ్తారు. అక్కడికి వెళ్ళాక కొన్ని అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి
పాయింట్ బాగానే ఉన్నప్పటికీ దీన్ని థియేటర్ కంటెంట్ గా మార్చడంలో దర్శక నిర్మాత పాపారావు బియ్యాల అనుభవలేమి సరైన స్క్రీన్ ప్లేని రాసుకోనివ్వలేదు. ఏకంగా పది పాటలు పెట్టినప్పటికీ ఏ ఒక్కటి మళ్ళీ వినాలనిపించేలా లేకపోవడం ఇళయరాజా వైపు నుంచి వచ్చిన అతి నెగటివ్ పాయింట్. శ్రేయ, శర్మాన్, ప్రకాష్ రాజ్, గాయకుడు షాన్, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి క్యాస్టింగ్ బాగా చేసినప్పటికీ సాగతీత సన్నివేశాలు, ఎమోషన్ లేని ఎపిసోడ్ల వల్ల మ్యూజిక్ స్కూల్ ని చివరి దాకా భరించడం కష్టమే అయ్యింది. ఆలోచన మంచిదే కానీ ఆచరణ సరిపోలేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…