ఇవాళ కస్టడీ చూశాక అధిక శాతం ప్రేక్షకులకు కలిగిన అనుమానం ఇదే. దర్శకుడు వెంకట్ ప్రభు గత చిత్రం మానాడు తమిళంలో ఎంత పెద్ద హిట్టో మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఓటిటిలో వచ్చాక తెలుగు అభిమానులు సైతం ఎగబడి చూశారు. టైం లూప్ కాన్సెప్ట్ ని తీసుకుని ఒకే సన్నివేశాన్ని నాలుగైదు సార్లు రిపీట్ చేసినా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా దాన్ని హ్యాండిల్ చేసిన తీరు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది. తమిళనాడులో కొన్ని సెంటర్స్ లో షిఫ్టింగ్ తో కలిపి వంద రోజులు ఆడి సంచలననం నమోదు చేసింది. తెలుగు డబ్ సిద్ధం చేసి రిలీజ్ ని ఆపారు.
దీన్ని రీమేక్ చేయాలనే ఉద్దేశంతో సురేష్ బాబు ఆ టైంలోనే హక్కులు కొన్నారు. కానీ సెట్స్ పైకి తీసుకెళ్లే ట్రయిల్స్ ఫలించలేదు. కీలకమైన రెండు పాత్రలు శింబు-ఎస్ జె సూర్యల స్థానంలో ఎవరిని తీసుకోవాలో ఎవరిని ఒప్పించాలో చేసిన ప్రయత్నాలు చాలా జాప్యాన్ని సృష్టించాయి. నాగచైతన్య, రవితేజ, వరుణ్ తేజ్, సిద్దు జొన్నలగడ్డ, సాయిధరమ్ తేజ్ ఇలా ఎవరెవరినో ట్రై చేశారట. కానీ కాంబినేషన్ సరిగా కుదరక ఇంకా లేట్ అవుతుందనే కారణంతో పెండింగ్ లో పెట్టారు. కట్ చేస్తే దీనికి టైం పడుతుందని గుర్తించిన దర్శకుడు వెంకట్ ప్రభు కస్టడీ కథను రాసుకున్నారు.
ఇది చైతుకి నచ్చడం నిర్మాత సుధాకర్ చిట్టూరి రెడీ కావడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ మానాడు రీమేక్ నే సీరియస్ గా తీసుకుని ఉంటే కస్టడీ వచ్చేది కాదన్న కామెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే హక్కులు సురేష్ సంస్థ దగ్గర ఉన్నప్పుడు వాటిని ఇచ్చేందుకాయన సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు. ఇప్పుడు ఆలస్యమైపోయింది. ఒకవేళ తీయాలనుకున్నా వెంకట్ ప్రభు బ్రాండ్ కి కస్టడీ వల్ల జరిగిన డ్యామేజ్ ఇబ్బంది పెట్టొచ్చు. క్రేజీ కాంబో కుదిరి దర్శకుడు మారితే చెప్పలేం కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కువ నాన్చకుండా వీలైనంత త్వరగా రీమేకులు చేసుకోవడం ఉత్తమం.
This post was last modified on May 12, 2023 9:32 pm
పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్.. లండన్ నుంచి ఇలా వచ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు,…
జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని కలుసుకోవడానికి త్వరలోనే ఒక వేడుక ఏర్పాటు చేస్తానని, అప్పటిదాకా ఓపిగ్గా ఎదురు చూడమని…
బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే…
కూటమి ప్రభుత్వంలో కలిసి మెలిసి ఉండాలని.. నాయకులు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు పదే పదే…
"ఫిబ్రవరి 4వ తేదీ నా రాజకీయ జీవితంలో ప్రత్యకంగా గుర్తుండిపోయే రోజు" అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.…