ఇవాళ కస్టడీ చూశాక అధిక శాతం ప్రేక్షకులకు కలిగిన అనుమానం ఇదే. దర్శకుడు వెంకట్ ప్రభు గత చిత్రం మానాడు తమిళంలో ఎంత పెద్ద హిట్టో మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఓటిటిలో వచ్చాక తెలుగు అభిమానులు సైతం ఎగబడి చూశారు. టైం లూప్ కాన్సెప్ట్ ని తీసుకుని ఒకే సన్నివేశాన్ని నాలుగైదు సార్లు రిపీట్ చేసినా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా దాన్ని హ్యాండిల్ చేసిన తీరు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది. తమిళనాడులో కొన్ని సెంటర్స్ లో షిఫ్టింగ్ తో కలిపి వంద రోజులు ఆడి సంచలననం నమోదు చేసింది. తెలుగు డబ్ సిద్ధం చేసి రిలీజ్ ని ఆపారు.
దీన్ని రీమేక్ చేయాలనే ఉద్దేశంతో సురేష్ బాబు ఆ టైంలోనే హక్కులు కొన్నారు. కానీ సెట్స్ పైకి తీసుకెళ్లే ట్రయిల్స్ ఫలించలేదు. కీలకమైన రెండు పాత్రలు శింబు-ఎస్ జె సూర్యల స్థానంలో ఎవరిని తీసుకోవాలో ఎవరిని ఒప్పించాలో చేసిన ప్రయత్నాలు చాలా జాప్యాన్ని సృష్టించాయి. నాగచైతన్య, రవితేజ, వరుణ్ తేజ్, సిద్దు జొన్నలగడ్డ, సాయిధరమ్ తేజ్ ఇలా ఎవరెవరినో ట్రై చేశారట. కానీ కాంబినేషన్ సరిగా కుదరక ఇంకా లేట్ అవుతుందనే కారణంతో పెండింగ్ లో పెట్టారు. కట్ చేస్తే దీనికి టైం పడుతుందని గుర్తించిన దర్శకుడు వెంకట్ ప్రభు కస్టడీ కథను రాసుకున్నారు.
ఇది చైతుకి నచ్చడం నిర్మాత సుధాకర్ చిట్టూరి రెడీ కావడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ మానాడు రీమేక్ నే సీరియస్ గా తీసుకుని ఉంటే కస్టడీ వచ్చేది కాదన్న కామెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే హక్కులు సురేష్ సంస్థ దగ్గర ఉన్నప్పుడు వాటిని ఇచ్చేందుకాయన సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు. ఇప్పుడు ఆలస్యమైపోయింది. ఒకవేళ తీయాలనుకున్నా వెంకట్ ప్రభు బ్రాండ్ కి కస్టడీ వల్ల జరిగిన డ్యామేజ్ ఇబ్బంది పెట్టొచ్చు. క్రేజీ కాంబో కుదిరి దర్శకుడు మారితే చెప్పలేం కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కువ నాన్చకుండా వీలైనంత త్వరగా రీమేకులు చేసుకోవడం ఉత్తమం.
This post was last modified on May 12, 2023 9:32 pm
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…