సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల మీద జనాలకే కాక మీడియాకు అమితాసక్తి ఉంటుంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో వ్యక్తిగత వివాదాలతో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన నటుల్లో నరేష్ పేరు ముందు చెప్పుకోవాలి. తన మూడో భార్యతో ఆయన గొడవలు.. పవిత్ర లోకేష్తో సహజీవనం గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ఈ గొడవలన్నీ కలిపి ‘మళ్ళీ పెళ్ళి’ అని సినిమా కూడా తీసేశారు నరేష్.
సీనియర్ దర్శక నిర్మాత ఎం.ఎస్.రాజు ీ చిత్రాన్ని రూపొందించగా నరేషే స్వయంగా నిర్మించాడు. ఇందులో నరేష్, పవిత్ర నిజ జీవత పాత్రలనే పోలిన క్యారెక్టర్లను ఇందులో పోషించగా.. నరేష్ మూడో భార్య పాత్రను తమిళ నటి వనిత విజయ్ కుమార్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో.. నరేష్ పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. పవిత్ర లోకేష్ను మీరు పెళ్లాడారా అని ఒక విలేకరి అడగ్గా.. ఆయన దానికి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘‘పెళ్లి అనే వ్యవస్థను మేం ఎంతగానో గౌరవిస్తాం. ఈ సినిమా దాని గురించే ఉంటుంది. ఈ రోజుల్లో జంటలకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేకే విడిపోతున్నారు. అందు వల్లే ప్రస్తుతం నాలుగైదు ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి. విడాకులు ఇవ్వడానికే ఇవన్నీ. వివాహ వ్యవస్థ ప్రాధాన్యాన్ని ఈ సినిమా చెబుతుంది. ఒక పెళ్లి అంటే ఒక్కో మతంలో ఒక్కో అర్థం ఉంటుంది. కొందరు తాళి కడతారు.. కొందరు ఉంగరం తొడుగుతారు.. కొందరు ఇంకోటి చేస్తారు. కానీ పెళ్లి అంటే రెండు హృదయాలు కలవడం’’ అని నరేష్ చెప్పారు. ఇదంతా కాదు మీరు పవిత్ర గారిని పెళ్లి చేసుకున్నారా లేదా అని విలేకరి రెట్టించి అడిగితే.. ‘‘చెప్పా కదా.. పెళ్లి అంటే రెండు హృదయాలు కలవడం’’ అని ముక్తాయించారు నరేష్.
This post was last modified on May 11, 2023 9:57 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…